
రాగి పాత్రల దగ్గరకు నాగుపాములు ఆకర్షితమవుతాయనే విషయం సనాతన విశ్వాసాల్లో విస్తృతంగా ప్రచారంలో ఉంది. దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక, శోధనాత్మక సత్యాన్ని ఆధ్యాత్మిక గురు సద్గురు జగ్గి వాసుదేవ్ వెల్లడించారు. సద్గురు ప్రకారం, భౌతిక జగత్తులోని విభిన్న లోహాలు ప్రాణశక్తితో భిన్నంగా వర్తిస్తాయి. రాగి అనేది కేవలం విద్యుత్, వేడిని మాత్రమే కాకుండా, విశ్వంలో ఉండే ప్రాణశక్తిని, అతి త్వరగా తనలోకి గ్రహించి, ప్రసరింపజేసే అద్భుతమైన లక్షణం కలిగిన లోహం. అందుకే ప్రాచీన కాలం నుండి యోగులు, ఆధ్యాత్మిక సాధకులు యంత్రాలు, ఆభరణాలు, పాత్రల తయారీలో రాగిని ప్రధానంగా ఉపయోగించేవారు.
నాగుపాములు ఇతర జీవులతో పోలిస్తే చుట్టూ ఉన్న శక్తి తరంగాలను పసిగట్టడంలో అత్యంత సున్నితమైన సునిశితత్వంతో కూడిన జ్ఞానేంద్రియ వ్యవస్థను కలిగి ఉంటుంది. భూమి పొరలలో జరిగే చిన్న మార్పుల నుండి పరిసరాలలోని శక్తి తరంగాల వ్యత్యాసాల వరకు నాగరపాములు సులభంగా గ్రహించగలవు. రాగి పాత్రలు లేదా రేకులు శక్తివంతమైన స్పందనలను విడుదల చేసినప్పుడు, నాగుపాములు ఆ స్పందనలను అనుభూతి చెంది ఆ దిశగా ఆకర్షించబడతాయి.
భారతదేశంలో పాములు పట్టే పురాతన తెగల వారు, యోగులు రాగి రేకులను ఉపయోగించి పాములను ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సులభంగా మళ్లించేవారని సద్గురు పేర్కొన్నారు. రాగి కల్పించే ఆకర్షణ, శక్తి తరంగాలు నాగుపాములను ఒక మైమరపు స్థితికి తెస్తాయి.
ఈ విధంగా రాగికి, నాగుపాములకు మధ్య ఉన్న అనుబంధం కేవలం మూఢనమ్మకం కాదని, దాని వెనుక లోహాల స్వభావం, జీవుల ప్రాణశక్తికి సంబంధించిన అద్భుతమైన శాస్త్రీయ, ఆధ్యాత్మిక కోణం దాగి ఉందనేది సద్గురు మాటల ద్వారా స్పష్టమవుతోంది.