
KTR: హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు ఫార్ములా ఈ రేస్ నిర్వహించామని, అందులో అవినీతి జరిగిందని తప్పుడు కేసులు పెట్టారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఫార్ములా ఈ కారు రేసు విచారణలో భాగంగా నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరైన కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కేసులకు భయపడము.. న్యాయవ్యవస్థలపై తమకు అపారమైన నమ్మకం ఉందన్నారు. పోలీసులు ఎంత వేధించిన ప్రజాస్వామ్య పద్ధతిలో న్యాయవ్యవస్థ తమకు వెన్నుదన్నుగా ఉందని ధీమా వ్యక్తం చేశారు.
ఫార్ములా ఈ రేస్ కేసులో ఎప్పుడు విచారణకు పిలిచినా రావడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. తమిళనాడు సీఎం విజయ్ ఫార్ములా ఈ రేస్ కోసం లండన్ వెళ్లారని.. పక్క రాష్ట్రాలు బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడం కోసం లండన్ వెళ్తుంటే ఇక్కడ తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. టార్గెట్ కేసీఆర్గా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని విమర్శించారు.. లక్ష కోట్లు సంపాదించామని కాంగ్రెస్ ప్రభుత్వం తమపై అసత్య ఆరోపణలు చేస్తుందన్నారు. “లక్ష కోట్లు కొల్లగొట్టామని రేవంత్ రెడ్డి అంటున్నారు.. రేవంత్కు మంచి ఆఫర్ ఇస్తున్నా.. రూ. 1000 కోట్లు ఇచ్చి మా పేరుపై ఉన్న లక్ష కోట్లు ఆస్తులు తీసుకోండి. మిగిలిన 99 వేల కోట్లు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలకోసం ఖర్చు చెయ్యండి.. కాళేశ్వరంలో లక్ష కోట్లని ప్రచారం చేసినట్లుగానే ఇప్పుడు విషప్రచారం చేస్తున్నారు” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.