Reading Time: < 1 minute
Kavitha New Party Announcement April 25 Telangana Politics

తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మరో కీలక మలుపు తిరగబోతోంది. రాష్ట్రంలో ఒక బలమైన రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్లు దాటినా, అమరవీరుల ఆశయాలైన నీళ్లు, నిధులు, నియామకాలు సంపూర్ణంగా సాకారం కాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం అధికారం కోసం కాకుండా, ‘సర్వోదయ తెలంగాణ’ సాధనే లక్ష్యంగా ఒక కొత్త శక్తి ఉద్భవించాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె పిలుపునిచ్చారు.

నిజామాబాద్ వేదికగా మాట్లాడిన కవిత, తనకూ ఈ ప్రాంతానికీ ఉన్న విడదీయలేని అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. “నేను నిజామాబాద్ కోడలిని, తెలంగాణ బిడ్డను. ఈ మట్టికి ఉన్న శక్తి అపారమైనది. నిజామాబాద్ గడ్డ నుంచి తీసుకునే ప్రతి ఆలోచన, చేసే ప్రతి నిర్ణయం ఖచ్చితంగా దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తుంది” అని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

Instagram Harassment Case: మైనర్‌ బాలికకు ఇన్‌స్టాలో వేధింపులు.. పోక్సో, కిడ్నాప్ కేసు నమోదు..

ప్రస్తుత ప్రభుత్వ తీరుపై ఆమె విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ, గత 20 రోజులుగా మార్క్‌ఫెడ్‌ను ఎందుకు తెరవడం లేదని నిలదీశారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తోందని, దీనివల్ల సామాన్య రైతు తీవ్రంగా నష్టపోతున్నాడని ఆరోపించారు. ప్రజలు ప్రస్తుతం తాము ఎలాంటి పరిపాలనలో ఉన్నామో ఒక్కసారి ఆలోచించుకోవాలని, ప్రజా సమస్యలను పట్టించుకోని పాలకులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 25వ తేదీన ఒక బలమైన ముహూర్తం ఉందని, ఆ రోజున మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్‌లో భారీ బహిరంగ సభ ద్వారా తన కొత్త రాజకీయ పార్టీ పేరును అధికారికంగా ప్రకటిస్తానని వెల్లడించారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రాజకీయ శూన్యతను భర్తీ చేస్తూ, ప్రజల పక్షాన నిలబడే ఒక శక్తివంతమైన వేదికగా ఈ పార్టీ రూపుదిద్దుకోబోతోందని ఆమె పేర్కొన్నారు.

Rohit Sharma: “ఓరి దేవుడా.. రోహిత్, గుర్తుపట్టలేకపోయాను”.. హిట్‌మ్యాన్‌ను చూసి అందరూ షాక్