
ప్రధాని మోడీ మరో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. జీ7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లనున్నారు. జూన్ 15 నుంచి 17 వరకు ఫ్రాన్స్లో జరిగే జీ7 సదస్సులో పాల్గొననున్నారు.
ఫ్రాన్స్ విదేశీ వ్యవహారాల మంత్రి జీన్-నోయెల్ బారోట్ గురువారం అబ్బే డెస్ వాక్స్-డి-సెర్నేలో జరిగిన జీ7 విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్తో చర్చలు జరిపారు. ఈ సదస్సులో ప్రధాని మోడీ పాల్గొంటారని వెల్లడించారు.
ఈ మంత్రుల సమావేశంలో మధ్యప్రాచ్యంలోని పరిస్థితులపై విస్తృతంగా చర్చలు జరిపారు. హార్ముజ్ జలసంధిపై సంయుక్తంగా పని చేయడానికి సన్నిహిత సమన్వయ్యాన్ని కొనసాగించాలని భారతదేశంలోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయం తెలిపింది. ఇక G7 కార్యకలాపాలకు భారతదేశం అందించిన సహకారాన్ని ఫ్రాన్స్ అభినందించింది.