Reading Time: < 1 minute
Nagpur Grandma Pours Boiling Water On Child Holi Incident

Shocking: మనవడిని కంటికి రెప్పలా కాపాడాల్సిన అమ్మమ్మ కోపంతో ఊగిపోయింది. కొన్ని క్షణాల పాటు తాను ఏం చేస్తున్నానో మరిచి దారుణంగా ప్రవర్తించింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో హోలీ వేడుకల్లో భాగంగా, తనపై రంగు పోయడానికి వచ్చిన 4 ఏళ్ల బాలుడు హరీష్ వాంగేపై వేడి నీళ్లను పోసింది. వేడి నీళ్ల బకెట్ తీసుకెల్తున్న సింధూ థాకరే అనే మహిళ బాలుడిపై వేడి నీరు కుమ్మరించడం అక్కడ ఉన్న సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయింది. బాలుడు మంటతో అల్లాడిపోతున్నట్లు వీడియో స్పష్టంగా ఉంది.

Read Also: KVN Productions : కెవిఎన్ ప్రొడక్షన్ హౌస్‌కు వరుస తలనొప్పులు

సమీపంలో నిలబది ఉన్న మరో మహిళ బాలుడి గాయాలను చల్లబరిచేందుకు చల్లని పోయడం చూడవచ్చు. బాలుడి నడుము కింద 45 శాతం కాలిన గాయాలయ్యాయి. ప్రస్తుతం బాలుడిని ఆస్పత్రిలో చేర్చారు. పోలీసులు సదరు మహిళపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.