
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆభియోగాలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్కు రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్చిట్ ఇచ్చింది. కేజ్రీవాల్తోపాటు ఢిల్లీ మాజీ మంత్రి సిసోడియాకు కూడా ఊరట లభించింది. ఆయనపై ఉన్న అభియోగాలను కూడా కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసు విచారణ సందర్భంగా సీబీఐ దాఖలు చేసిన చార్జ్షీట్లో మెరిట్ లేదని రౌస్ అవెన్యూ కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్కు, సిసోడియాపై సీబీఐ మోపిన అన్ని అభియోగాలను కొట్టి వేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.