Reading Time: < 1 minute
Union Cabinet Likely To Approve Kerala Name Change

ప్రధాని మోడీ అధ్యక్షతన మంగళవారం ఉదయం కేంద్ర కేబినెట్ సమావేశం అయింది. ఈ సమావేశంలో కేరళ పేరును మార్చేందుకు ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పేరు మార్పునకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇది కూడా చదవండి: Trump: ఎంత కాలం ఉంటానో తెలియదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు

అన్ని భాషల్లో రాష్ట్రం పేరును కేరళ నుంచి ‘‘కేరళం’’గా మార్చాలని కోరుతూ 2024లో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. మలయాళంలో రాష్ట్రాన్ని కేరళంగా పిలుస్తారని.. మలయాళం ప్రజలు అదే పేరు పెట్టాలని కోరుకుంటున్నారని విజయన్ తెలిపారు.

ఇదిలా ఉంటే ఇంకా కేరళ ఎన్నికల షెడ్యూల్ వెలువడ లేదు. ఈ నేపథ్యంలో కేరళ పేరును కేరళంగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈరోజు సేవా తీర్థంలో కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఇటీవలే ప్రధానమంత్రి కార్యాలయాన్ని నిర్మించారు. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడించనున్నారు.