Reading Time: < 1 minute
Delhi Police Yet To Receive Order To Withdraw Cjp Protest Cases

Delhi Protest: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ), యువత జంతర్ మంతన్ వద్ద చేసిన నిరసనల్లో నమోదైన కేసుల్ని విత్ డ్రా చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు అందలేదని ఢిల్లీ పోలీస్ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయిన తర్వాత మాత్రమే చట్టపరమైన ప్రక్రియ ప్రారంభం అవుతుందని, చివరకు కోర్టులదే నిర్ణయమని చెప్పినట్లు సమాచారం. సీజేపీ ఆందోళన విరమణకు పెట్టిన షరతుల్లో కేసుల ఉపసంహరణ కూడా ఉంది. ప్రభుత్వం దీనికి అంగీకరించింది.

ఇదిలా ఉంటే, నిరసనల సందర్బంగా జర్నలిస్టులపై దాడి జరిగిందంటూ నమోదైన కేసులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపసంహరించుకునేది ఢిల్లీ పోలీసులు చెబుతున్నట్లు తెలుస్తోంది. జూలై 20న చేపట్టిన పార్లమెంట్ మార్చ్ ర్యాలీ హింసాత్మకం మారడంతో, నిరసనకారులపై చాలా కేసులో నమోదయ్యామయి. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 20 కేసులు నమోదయ్యాయి. మిగిలినవి జర్నలిస్టులపై దాడుల కేసులని పోలీసులు తెలిపారు. ప్రభుత్వం కేసుల ఉపసంహరణపై ఆదేశాలు జారీ చేస్తే, ప్రాసిక్యూషన్ లెఫ్టినెంట్ గవర్నర్‌కు నివేదిక పంపుతుంది. ఆమోదం తర్వాత సంబంధిత కోర్టులకు ప్రాసిక్యూషన్ కొనసాగించబోమని పోలీసులు తెలియజేస్తారు. అనంతరం కేసులపై తుది నిర్ణయం కోర్టులు తీసుకుంటాయి.