July 6, 2026

IPS Officers: ఏపీలో పలువురు ఐపీఎస్‌ అధికారుల బదిలీ..

IPS Officers: ఏపీలో పలువురు ఐపీఎస్‌ అధికారుల బదిలీ..
Reading Time: < 1 minute
Andhra Pradesh Transfers Ips Officers Government Issues Fresh Posting Orders

IPS Officers: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా కారణాలతో కొంతమంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనా అవసరాల దృష్ట్యాలో ఉంచుకొని ఐపీఎస్ అధికారులకు తక్షణమే బదిలీలు, కొత్త పోస్టింగ్‌లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్..

బదిలీ అయిన అధికారులు
1. చింతపల్లి ఏఎస్పీగా ఉన్న నవజ్యోతి మిశ్రాను.. ఓఎస్డీ (అడ్మిన్), మార్కాపురం జిల్లాకు బదిలీ
2. కాకినాడ ఏఎస్పీగా ఉన్న పాటిల్ దేవ్రాజ్ మనీష్‌ను అదనపు ఎస్పీ (అడ్మిన్), తూర్పు గోదావరి జిల్లా (రాజమహేంద్రవరం) బదిలీ..
3. నంద్యాల ఏఎస్పీగా ఉన్న మండా జవాలి అల్ఫోన్స్, ఐపీఎస్.. ఓఎస్డీ (అడ్మిన్), పోలవరం జిల్లా బదిలీ
4. రాజంపేట్‌ ఏఎస్పీగా ఉన్న మనోజ్ రామనాథ్ హెగ్డే, ఐపీఎస్.. ఓఎస్డీ (లా అండ్ ఆర్డర్), అమరావతి బదిలీ
5. తాడిపత్రి ఏఎస్పీగా ఉన్న రోహిత్ కుమార్ చౌదరి, ఐపీఎస్.. అదనపు ఎస్పీ (అడ్మిన్), పల్నాడు జిల్లాకు బదిలీ
6. జంగారెడ్డిగూడెం ఏఎస్పీగా ఉన్న సుస్మిత, ఐపీఎస్.. ఏఎస్పీ, నంద్యాలకు బదిలీ

ఈ బదిలీలకు సంబంధించి అవసరమైన చర్యలను వెంటనే చేపట్టి, ప్రభుత్వానికి సమాచారం అందించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్)ను ప్రభుత్వం ఆదేశించింది.