సంపద కంటే ఆరోగ్యమే గొప్ప పెట్టుబడి.. బావిలో ఈత కొట్టిన మంత్రి జూపల్లిCaption of Image.
కొల్లాపూర్, వెలుగు: మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం కొల్లాపూర్ శివారులోని తన వ్యవసాయ క్షేత్రం వద్ద సరదాగా గడిపారు. బావిలో గంటపాటు ఈత కొట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనిషి సంపాదించే సంపద కంటే ఆరోగ్యమే గొప్ప పెట్టుబడి అని అన్నారు. ప్రతిరోజూ కనీసం గంటపాటు యోగా, ధ్యానం, వాకింగ్, జాగింగ్, రన్నింగ్, ఈత వంటి శారీరక శ్రమతో కూడిన వ్యాయామం చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పారు.