
భద్రాచలం, వెలుగు: గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.86.70 కోట్లు కేటాయించింది. అలాగే, భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో కొత్త డార్మెటరీ హాల్ నిర్మాణానికి రూ.1.50 కోట్లు మంజూరు చేసింది. అంబసత్రం దగ్గర జీ ప్లస్ మోడల్లో ఈ హాల్ను నిర్మించనున్నట్లు దేవస్థానం ఈవో దామోదర్ రావు తెలిపారు.
గోదావరి పరీవాహక ప్రాంతంలోని కందకుర్తి(నిజామాబాద్), బాసర (నిర్మల్), మంగపేట (ములుగు), కొండవటంచ (జయశంకర్భూపాల్పల్లి), భద్రాచలం (భద్రాద్రికొత్తగూడెం), మంచిర్యాల, కాళే శ్వరం (జయశంకర్ భూపాల్పల్లి), మంథని, ఓదెల (పెద్దపల్లి), కోటిలింగాల, ధర్మపురి (జగిత్యాల) ప్రాంతాల్లో పుష్కరాల ఏర్పాట్ల కోసం ఈ నిధులు వినియోగించనున్నారు.