Reading Time: < 1 minute

పూరి జగన్నాథ్ ఆలయ నమూనాలో… బాలాపూర్ గణేష్ మండపం స్పెషల్ అట్రాక్షన్… 

Caption of Image.

తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి అంటే ఖైరతాబాద్ బడా గణేష్ తర్వాత గుర్తొచ్చేది బాలాపూర్ గణేశుడే. బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలంపాట రికార్డుస్థాయిలో పలకడమే ఇందుకు కారణం. అయితే బాలాపూర్ గణేశుడి లడ్డూ మాత్రమే కాకుండా మండపం కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. ప్రతి సంవత్సరం ఒక దేవాలయం నమూనాలో ఆకట్టుకుంటున్న బాలాపూర్ గణేష్ మండపం.. ఈ సంవత్సరం పూరి జగన్నాథ్ ఆలయ నమూనాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది.

ఈ ఏడాది పూరీ జగన్నాథ స్వామి ఆలయ థీమ్‌లో బాలాపూర్ గణేశుడు భక్తులకుడ్ దర్శనమిస్తున్నాడు. సుమారు రూ.40 లక్షలతో ఈ భారీ నమూనా నిర్మించినట్లు సమాచారం. 

కొన్ని సంవత్సరాలుగా వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తుండగా ఈసారి అంతకుమించి ఉత్సవాలు నిర్వహించాలని బాలాపూర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా లడ్డూ వేలంలో రికార్డులు తిరగరాసే బాలాపూర్‌ గణేశుడి లడ్డూ ఈసారి ఎంత పలుకుతుందో చూడాలి.

©️ VIL Media Pvt Ltd.