Reading Time: < 1 minute

మిజోరాంలో రవాణా విప్లవం..బైరాబి– సాయిరాంగ్ రైల్వే మార్గంతో కొత్త శకం 

Caption of Image.

ఐజ్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: సరికొత్త రవాణా చరిత్రకు వేదికవుతూ, ఈశాన్య రాష్ట్రమైన మిజోరాంలో ప్రగతి శకానికి బైరాబి – సాయిరాంగ్ రైల్వే మార్గం శ్రీకారం చుట్టింది. గతేడాది సెప్టెంబర్ 13న ప్రధాని నరేంద్ర మోదీ ఈ 51.38 కిలోమీటర్ల రైలు మార్గాన్ని ప్రారంభించారు. సాయిరాంగ్ స్టేషన్ ఆ ప్రాంత ప్రజల జీవితాల్లో కీలక మార్పులు తెచ్చింది. మెరుగైన ప్రయాణ సౌకర్యాలు, మార్కెట్లకు సులభమైన చేరువ, పర్యాటక రంగ వృద్ధి అలాగే నూతన ఉపాధి అవకాశాలను సృష్టిస్తూ ఈ ప్రాజెక్ట్ మిజోరాం అభివృద్ధికి ఒక బలమైన వారధిలా నిలిచింది.

కఠిన భూభాగం కారణంగా తరతరాలుగా రోడ్డు మార్గాలకే పరిమితమైన మిజోరాం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యకు బైరాబి–సాయిరాంగ్ రైల్వే ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో పరిష్కారం చూపింది. ఈ రైలు మార్గంలో మొత్తం 153 వంతెనలు ఉన్నాయి. అలాగే దాదాపు 16 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న 45 సొరంగాల గుండా ఈ రైలు మార్గం వెళ్తుంది. బైరాబి నుంచి మొదలై హోర్టోకి, కౌన్పుయ్, మువాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఖాంగ్ మీదుగా సాయిరాంగ్ స్టేషన్ వరకు సాగే ఈ మార్గం.. మిజోరాం రాజధాని ఐజ్వాల్ ముఖద్వారం వరకు రైలు రవాణాను తీసుకువచ్చింది.

రైలు మార్గం ప్రారంభమైన మరుసటి రోజే అంటే 2025, సెప్టెంబర్ 14న సాయిరాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మొదటి గూడ్స్ రైలు చేరుకుంది. గౌహతి సమీపంలోని స్టార్ సిమెంట్ సైడింగ్ నుంచి 26 వేలకు పైగా సిమెంట్ బస్తాలతో వచ్చిన ఈ రైలు.. ఐజ్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సిమెంట్ ధరలు గణనీయంగా తగ్గడానికి దోహదపడింది. అలాగే డిసెంబర్ 2025లో గౌహతి సమీపంలోని చాంగ్సారి నుంచి 119 మారుతి కార్లతో కూడిన తొలి ఆటోమొబైల్ కార్గో సాయిరాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 
చేరుకుంది.

©️ VIL Media Pvt Ltd.