Reading Time: < 1 minute

ప్రతి కుటుంబానికి కనెక్ట్ అయ్యే కథ పిఠాపురంలో అలా మొదలైంది..

Caption of Image.

రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో ‘ప్రేయసి రావే’ ఫేమ్ మహేష్ చంద్ర రూపొం దించిన చిత్రం ‘పిఠాపురంలో అలా మొదలైంది’ దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళీ (గోదారి కిట్టయ్య) నిర్మించారు. ప్రైమ్ షో ఎంట ర్టైన్మెంట్ ద్వారా సెప్టెంబర్ 18న సినిమా విడుదల కానుంది.. తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వ హించారు. అతిథిగా హాజరైన నటుడు సుమన్ టీజర్ విడుదల చేసి టీము బెస్ట్ విషెస్ చెప్పారు. 

ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ‘ఈ కథలోని ఎమోషన్ నన్ను బాగా ఆకట్టుకుంది. తండ్రీకూతుళ్ల అనుబంధం, కుటుంబ భావోద్వేగాలతో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది’ అని చెప్పారు. 

ఇది ప్రతి కుటుంబానికి కనెక్ట్ అయ్యే కథ అని, కుటుంబ సమేతంగా ప్రేక్షకులు సినిమాను ఆదరించాలని దర్శకుడు మహేష్ చంద్ర అన్నాడు. కార్యక్రమంలో పాల్గొన్న నటుడు పృథ్వీ, బీవీఎస్ రవి, దర్శకు లు రాం ప్రసాద్, సముద్ర, వీర శంకర్ సినిమా మంచి విజయం సాధించాలని కోరారు.

©️ VIL Media Pvt Ltd.