Reading Time: < 1 minute

కొడంగల్: భక్తులు మెచ్చేలా వేంకటేశుని ఆలయ నిర్మాణం

Caption of Image.

కొడంగల్​, వెలుగు: భక్తులు మెచ్చేలా శ్రీమహాలక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేపడుతామని కాంగ్రెస్ కొడంగల్​ నియోజకవర్గ ఇన్​చార్జి ఎనుముల తిరుపతిరెడ్డి అన్నారు. ప్రభుత్వం కొడంగల్​లో రూ.110 కోట్లతో చేపడుతున్న ఆలయ పునర్​నిర్మాణం, విస్తరణ పనులను బుధవారం భూమిపూజ చేసి ప్రారంభించారు. శ్రీవారి ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్​రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. 

కాకతీయుల కాలం నాటి శిల్పకళ ఉట్టిపడేలా ఆలయ నిర్మాణం ఉంటుందని, ప్రత్యేకంగా కృష్ణ శిలలు తెప్పించినట్లు చెప్పారు. మున్సిపల్​ చైర్మన్​ ప్రశాంత్, వైస్ చైర్మన్ శంకర్​నాయక్ తదితరులు పాల్గొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.