
తమిళ చిత్ర పరిశ్రమ (కోలీవుడ్)లో నిర్మాతలు, హీరోల మధ్య పారితోషకాల వివాదం తీవ్ర సమ్మెకు దారితీసింది. అధిక పారితోషకాలకు బదులు సినిమా లాభాల్లో వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కోలీవుడ్ నిర్మాతలు మే 2 నుండి డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ సహా అన్ని పనులను నిలిపివేశారు. ఈ సమ్మె వల్ల కోట్లలో నష్టం వాటిల్లుతున్నప్పటికీ, అగ్ర హీరోలు ఇప్పటికీ స్పందించలేదు. నిర్మాతలు పారితోషకాల విషయంలో హీరోలను బలవంతం చేయడం లేదని, డిమాండ్ను బట్టే పారితోషకం తీసుకుంటున్నారనేది హీరోల వాదన. వందల కోట్లు పెట్టుబడిగా పెట్టి తీసిన సినిమా ఫ్లాప్ అయితే డిస్ట్రిబ్యూటర్ల నుండి నిర్మాతల వరకు ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుందని, అందుకే రిస్కు తగ్గించుకునేందుకు ఈ పోరాటానికి తెరతీశారని నిర్మాతలు చెబుతున్నారు. గతంలో జానీ, బాబా వంటి సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు పవన్ కళ్యాణ్, రజినీకాంత్ వంటి స్టార్లు నష్టాలు భరించారు.
మరిన్ని వీడియోల కోసం :