Reading Time: 2 minutes
Ola Electric Roadster X Plus Gets Government Approval 4680 Bharat Cell

Ola Electric Roadster X+: ఓలా ఎలక్ట్రిక్ తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ రోడ్‌స్టర్ X+కు ప్రభుత్వ అనుమతి లభించిందని మంగళవారం ప్రకటించింది. ఈ అనుమతితో రోడ్‌స్టర్ X+ డెలివరీలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ బైక్‌లో కంపెనీ స్వదేశీగా అభివృద్ధి చేసిన 4680 భారత్ సెల్ బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించింది. 9.1 కిలోవాట్ అవర్ బ్యాటరీ సామర్థ్యం ఉన్న రోడ్‌స్టర్ X+కు సెంట్రల్ మోటార్ వెహికిల్ రూల్స్ (CMVR), మానేసర్‌లోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (iCAT) సర్టిఫికేషన్ ఇచ్చిందని కంపెనీ తెలిపింది. ఈ సర్టిఫికేషన్‌తో పూర్తిగా తమ సంస్థలోనే అభివృద్ధి చేసిన 4680 భారత్ సెల్ బ్యాటరీ ప్యాక్‌తో అనుమతి పొందిన భారతదేశంలోని తొలి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌గా రోడ్‌స్టర్ X+ నిలిచిందని ఓలా ఎలక్ట్రిక్ పేర్కొంది. ఇది కంపెనీకి ఒక ముఖ్యమైన మైలురాయిగా భావిస్తోంది. ఈ అనుమతితో పాటు, ఓలా ఎలక్ట్రిక్ తమ ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణి అంతటా 4680 భారత్ సెల్ టెక్నాలజీని విస్తరించినట్లు కంపెనీ తెలిపింది.

READ MORE: 2025 Crimes Rewind: గోల్డ్ స్మగ్లింగ్ దగ్గర నుంచి హనీమూన్ మర్డర్ వరకు..! ఈ ఏడాది క్రైమ్ సీన్ ఇవే!

ఈ సర్టిఫికేషన్ కోసం వాహన భద్రత, ఎలక్ట్రికల్ వ్యవస్థలు, పనితీరు, పర్యావరణ ప్రమాణాలపై కఠినమైన పరీక్షలు నిర్వహించారని, ఇవన్నీ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ మంత్రిత్వ శాఖ (MoRTH) నిబంధనల ప్రకారం జరిగాయని కంపెనీ వివరించింది. ఇందులో నిర్మాణ భద్రత, పనితీరు, రేంజ్, ఎత్తైన దారుల్లో పనితీరు, శబ్దం, ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ అనుకూలత, బ్రేకింగ్ సామర్థ్యం వంటి కీలక పరీక్షలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ ప్రతినిధి మాట్లాడుతూ, రోడ్‌స్టర్ X+కు ప్రభుత్వ సర్టిఫికేషన్ లభించడం భారత్‌లో పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వాహన సాంకేతికతను అభివృద్ధి చేయాలన్న తమ ప్రయాణంలో ఒక కీలక ఘట్టమని అన్నారు. ఈ బైక్ ద్వారా, పూర్తిగా తమ సొంత సెల్ మరియు బ్యాటరీ టెక్నాలజీ ఆధారంగా, అత్యుత్తమ రేంజ్‌తో పాటు మంచి పనితీరు, భద్రత, నమ్మకాన్ని అందిస్తున్నామని చెప్పారు. మోటార్‌సైకిళ్లు ఎక్కువగా వినియోగించే భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను వేగవంతం చేసే దిశగా ఇది ఒక కీలక అడుగని ఆయన అన్నారు.

READ MORE: Best Budget Phones: 2026లో రూ. 15,000 లోపు బెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే..!

కాగా…ఇటీవల కంపెనీ రోడ్ స్టర్‌ ఎక్స్‌ ప్లస్‌ను రెండు బ్యాటరీ ప్యాక్స్‌తో తీసుకొచ్చింది. ఓలా రోడ్‌స్టర్ X+ అనేది అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఎలక్ట్రిక్ బైక్ 4.5kWh బ్యాటరీ వేరియంట్‌ ధర రూ.1,04,999గా కంపెనీ నిర్ణయించింది. దీని ఐడీసీ రేంజ్‌ 259 కిలోమీటర్లు. ఇక 9.1kWh వేరియంట్‌ ధర రూ.1,54,999 పేర్కొంది. దీని ఐడీసీ రేంజ్‌ 501 కిలోమీటర్లుగా కంపెనీ ప్రకటించింది. ఈ రెండు మోటార్ సైకిళ్ల టాప్‌స్పీడ్‌ గంటకు 125 కిలోమీటర్లు. క్రూయిజ్‌ కంట్రోల్‌, రివర్స్‌ మోడ్‌ వంటి ఫీచర్లతో వస్తోంది. సిరామిక్‌ వైట్‌, పైన్‌ గ్రీన్‌, ఇండస్ట్రియల్‌ సిల్వర్‌, స్టెల్లర్‌ బ్లూ, అంత్రాసైట్‌ రంగుల్లో లభిస్తాయి. ఇందులో 4.3-అంగుళాల కలర్ LCD డిస్‌ప్లే, స్పోర్ట్స్/నార్మల్/ఎకో రైడింగ్ మోడ్‌లు, క్రూజ్ కంట్రోల్, రివర్స్ మోడ్, రీజనరేటివ్ బ్రేకింగ్, GPS, OTA అప్‌డేట్‌లు, ఓలా యాప్ ఇంటిగ్రేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.