Reading Time: < 1 minute

కుల సర్వేను ప్రజల ముందుంచాలి..సమాజ్వాది పార్టీ డిమాండ్

Caption of Image.
  • ఈ సర్వే నివేదిక సామాజిక తెలంగాణ ఎక్స్​రే
  • ప్రొఫెసర్ ఎస్. సింహాద్రి

బషీర్​బాగ్, వెలుగు: రాష్ట్రంలో నిర్వహించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా కుల సర్వే రిపోర్టును వెంటనే ప్రజల ముందుంచాలని సమాజ్​వాది పార్టీ డిమాండ్ చేసింది. హైదరాబాద్​లోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎస్. సింహాద్రి యాదవ్ మాట్లాడుతూ.. ఈ రిపోర్టుపై క్యాబినెట్​లో చర్చ జరగడం శుభపరిణామమని, అయితే నివేదికను ప్రజలకు కూడా అందుబాటులో ఉంచడం అత్యంత అవసరమన్నారు. ఈ సర్వే నివేదిక సామాజిక అంతరాలను తగ్గించడానికి దోహదపడుతుందని, ప్రజా సంఘాలు, మేధావులు దీన్ని అధ్యయనం చేయాలని అభిప్రాయపడ్డారు.

ప్రతి కుటుంబాన్ని కవర్ చేస్తూ రూపొందించిన ఈ సర్వేను ‘సామాజిక తెలంగాణ ఎక్స్​రే’గా అభివర్ణించారు. రాజ్యాంగ లక్ష్యాలైన సమానత్వం, సామాజిక న్యాయం సాధనలో ఈ రిపోర్టు కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. సమావేశంలో నాయకులు మహ్మద్ బేగ్, వజీద్ సిద్ధికి, రిజ్వాన్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. 

 

©️ VIL Media Pvt Ltd.