Reading Time: < 1 minute

ఆర్థిక సంక్షోభంపై మోదీ మౌనం వీడాలి : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ 

Caption of Image.

గద్వాల, వెలుగు : దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వీడి, పరిష్కార చర్యలు తీసుకోవాలని  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని వాల్మీకి కమ్యూనిటీ హాల్‌‌‌‌లో జరిగిన సీపీఎం జిల్లా కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రూపాయి విలువ పడిపోతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా అవాస్తవాలను ప్రచారం చేస్తోందన్నారు.

ఇరాన్‌‌‌‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఖండించకపోవడం  దారుణమని మండిపడ్డారు. రైతు కూలీలకు రూ. 12 వేలు, మహిళలకు రూ. 2,500, కల్యాణ లక్ష్మికి తులం బంగారం లాంటి హామీలను అమలు చేయడంలో విఫలమైన ప్రభుత్వం, దేశానికే ఆదర్శంగా నిలిచిన కేరళను విమర్శించడం సిగ్గుచేటని విమర్శించారు. 

 

©️ VIL Media Pvt Ltd.