Reading Time: < 1 minute

రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ ఫోక్ నటులు..చితకబాదిన ఈశ్వర్సాయి భార్య శరణ్య

Caption of Image.
  • పోలీస్​స్టేషన్​కు చేరిన పంచాయితీ

వేములవాడ, వెలుగు: ‘రాతిరి రాతిరి’ లాటి ఫోక్​సాంగ్స్​తో ఫేమస్​అయిన నటులు ఈశ్వర్​సాయి, మాధురి రాథోడ్ ఏకంతంగా పట్టుబడడం సంచలనం రేపింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సమీపంలోని నందికమాన్​వద్ద ఉన్న రెడ్డి సంఘం భవనంలోని ఓ గదిలో ఉండగా ఈశ్వర్​సాయి భార్య శరణ్య వారిద్దరిని బుధవారం తెల్లవారుజామున రెడ్​హ్యాండెండ్​గా పట్టుకొని చితకబాదారు. కోట్లలో వ్యూస్​ ఉన్న “రాతిరి రాతిరి”, “ప్రమీల ఓ ప్రమీల” వంటి ఫోక్ సాంగ్స్​లో నటించిన ఈశ్వర సాయి, మాధురి రాథోడ్ మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు గుర్తించిన శరణ్య.. కొంతకాలంగా వారిపై నిఘా ఉంచారు. 

పక్కా సమాచారంతో వేములవాడలోని ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఒకే గదిలో ఈశ్వర్, మాధురి రాథోడ్ కలిసి ఉన్న సమయంలో వారిని పట్టుకున్నారు. గదిలో వారిని నిలదీస్తున్న దృశ్యాలు, అక్కడ జరిగిన గొడవకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారిద్దరిని పోలీసులకు అప్పగించారు. ఈ విషయంపై సీఐ వీరాప్రసాద్​ను వివరణ కోరగా వారికి కౌన్సిలింగ్​ ఇచ్చామని తెలిపారు.  Eshwar Sai, Madhuri Rathod, Saranya, Vemulawada news, Rajanna Sircilla news, 

©️ VIL Media Pvt Ltd.