
Congress: కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు బి.కె. హరిప్రసాద్ ఆర్ఎస్ఎస్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్, జైష్-ఎ-మొహమ్మద్, తాలిబన్ మధ్య ఎలాంటి తేడా లేదని, ఈ మూడు సంస్థలు దేశంలో రిజిస్టర్ కాలేదని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగింది. దేశంలో ఆర్ఎస్ఎస్ రిజిస్టర్ కాలేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఆర్ఎస్ఎస్ తన శాఖల్లో వందేమాతరం, జాతీయ గీతం పాడదని, త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయదని కూడా హరిప్రసాద్ ఆరోపించారు.
ఇదే సమయంలో కాంగ్రెస్ మంత్రి ప్రియాంక్ ఖర్గే కూడా ఆర్ఎస్ఎస్ రిజిస్ట్రేషన్, నిధులు, కార్యకాలపాలకు సంబంధించిన వివరాలను వెల్లడించాలని కోరుతున్నారు. ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ ఆస్తుల్ని రిజిస్టర్ కానీ సంస్థలు వినియోగించడాన్ని నియంత్రించే బిల్లును కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడానికి సిద్ధమవుతోంది. మరోవైపు, కర్ణాటక మంత్రి యతీంద్ర సిద్ధరామయ్య కూడా ఆర్ఎస్ఎస్పై తీవ్ంర వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ వెయ్యి తలల విషసర్పం అని కులవాదం, మతతత్వం, మనువాదంతో సమాజాన్ని విషపూరితం చేసిందని ఆరోపించారు.
అయితే కాంగ్రెస్ నేతల వ్యాఖ్పలై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఢిల్లీ బీజేపీ ఎంపీ ధర్మశిలాగుప్తా మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ దేశం ముందు అని భావిచే సిద్ధాంతంతో పనిచేస్తుందని, దేశ సంస్కృతి, సంప్రదాయాలు, నాగరికత, అభివృద్ధి కోసం సేవ చేస్తుందని అన్నారు. మాజీ బీజేపీ నేత బసనగౌడ పాటి కూడా హరిష్ ప్రసాద్ వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. జైషే మహ్మద్ లాగా ఆర్ఎస్ఎస్ ఎవరిపై బాంబులు వేసిందని ప్రశ్నించారు.