
బీఆర్ ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ ఎస్ హయాంలో సమక్క, సారలమ్మలను నిర్లక్ష్యం చేశారని అన్నారు. బతుకమ్మ చీరలలో నూ కమిషన్లు కొట్టారని విమర్శించారు. తోడ బుట్టకపోయినా.. మంత్రి సీతక్కను నా సొంత సోదరిలా చూస్తున్నాను.. ఆస్తికోసం కొందరు సొంత చెల్లెలినే ఇంట్లోంచి బయటికి వెళ్లగొట్టారని అన్నారు. ఇంకొకరు కర్నాటకకు వెళ్లి మరీ అఘోరాలతో క్షుద్ర పూజలు చేయిస్తున్నారని ఆరోపించారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకొని సమ్మక్క సారలమ్మ ఆలయాన్ని నిర్మించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎల్ నినో ఉన్నా రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి. అఘోరారావు ఎన్ని క్షుద్రపూజలు చేసినా దేవుడు మనవైపే ఉన్నాడు.. ఎన్ని అడ్డంకులు వచ్చినా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
పాదయాత్రలో ప్రజల ఆశీర్వాదంతోనే ప్రజా ప్రభుత్వం వచ్చింది.. సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుని జనంలోకి వెళ్లాను.. పీసీసీ అధ్యక్షుడిగా ములుగునుంచే పాదయాత్ర ప్రారంభించాను ..సమ్మక్క, సారలమ్మ ఆశీర్వాదంతోనే ప్రజాప్రభుత్వం వచ్చిందన్నారు సీఎం.. త్వరలో జంపన్న వాగును అభివృద్ది చేస్తామని హామీ ఇచ్చారు.
మంత్రి సీతక్క నేతృత్వంలో ములుగు జిల్లాలో అనేక అభివృద్ది పనులు ప్రారంభించాం.. నూతనంగా కలెక్టరేట్ భవన సముదాయాన్ని నిర్మించా ఇవాళ ప్రారంభించాం.. త్వరలో కలెక్టరేట్ పక్కనే ఎస్పీ ఆఫీసును నిర్మిస్తామని సీఎం హామీ ఇచ్చారు.