July 12, 2026

రో– కో మ్యానియా మళ్లీ స్టార్ట్.. ఇంగ్లాండ్ సిరీస్‌కు ముందు కోహ్లీ– రోహిత్ ఫన్నీ ఇన్సిడెంట్ వైరల్!

రో– కో మ్యానియా మళ్లీ స్టార్ట్.. ఇంగ్లాండ్ సిరీస్‌కు ముందు కోహ్లీ– రోహిత్ ఫన్నీ ఇన్సిడెంట్ వైరల్!
Reading Time: 2 minutes

రో– కో మ్యానియా మళ్లీ స్టార్ట్.. ఇంగ్లాండ్ సిరీస్‌కు ముందు కోహ్లీ– రోహిత్ ఫన్నీ ఇన్సిడెంట్ వైరల్!

Caption of Image.

Virat Kohli vs Rohit Sharma: ఇంగ్లాండ్ చేతిలో టీ20 సిరీస్‌ని క్లీన్ స్వీప్ కావడంతో పాటు నంబర్ వన్ ర్యాంకును కోల్పోయి తీవ్ర నిరాశలో ఉన్న భారత క్రికెట్ అభిమానులకు ఒక ఫుల్ జోష్ ఇచ్చే విజువల్స్ నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. జులై 14 నుంచి ఇంగ్లాండ్ తో ప్రారంభమయ్యే వన్డే (ODI) సిరీస్ కోసం లండన్‌లో శ్రమిస్తున్న టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌లో స్టాన్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఒకరినొకరు హగ్ చేసుకుంటూ కనిపించారు. నెట్స్‌లో వీరిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ, నవ్వులు పూయించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.  

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బ్రోమాన్స్: 
గత కొంతకాలంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల మధ్య విభేదాలు ఉన్నాయంటూ నెట్టింట వస్తున్న రకరకాల రూమర్స్, ఊహాగానాలకు ఈ ఒక్క వీడియోతో పూర్తిగా చెక్ పడింది. ఈ వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు భారత మేనేజ్‌మెంట్, సపోర్ట్ స్టాఫ్ సమక్షంలో ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు ఎంతో క్లోజ్‌గా ముచ్చటించడం చూడొచ్చు. దేశం కోసం ఎన్నో ఏళ్లుగా కలిసి ఆడుతూ ఎన్నో రికార్డులు సృష్టించిన ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్ల బంధం చూసి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. 

ఇంగ్లాండ్ కండిషన్స్‌లో రోహిత్, విరాట్ రోల్స్: 
ఈ వన్డే సిరీస్‌కు యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండటంతో, ఇంగ్లాండ్‌లోని బౌన్సీ, సీమింగ్ కండిషన్స్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అనుభవం జట్టుకు అత్యంత కీలకం కానుంది. ఇంగ్లీష్ గడ్డపై ఇద్దరికీ అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉండటంతో, టీ20 సిరీస్ పరాభవం నుంచి కోలుకుని వన్డేల్లో భారత్ శుభారంభం చేయాలంటే వీరిద్దరే బ్యాటింగ్ ను ముందుండి నడిపించాల్సి ఉంటుంది. 

వన్డేల్లో కసితీర్చుకోవడమే లక్ష్యం: 
మైదానం వెలుపల ఈ ఇద్దరు సూపర్ స్టార్ల మధ్య ఉన్న బాండింగ్ అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపగా.. ఇప్పుడు అందరి దృష్టి త్వరలో ప్రారంభం కానున్న వన్డే మ్యాచ్‌లపైనే పడింది. టీ20 సిరీస్‌లో ఎదురైన ఘోర అవమానానికి వన్డే సిరీస్ క్లీన్ స్వీప్‌తో ఇంగ్లండ్‌పై బదులు తీర్చుకోవాలని గంభీర్ సేన పట్టుదలగా ఉంది. రోహిత్, విరాట్‌లు నెట్స్‌లో చూపిస్తున్న ఈ హై-ఎనర్జీ, పాజిటివ్ మైండ్‌సెట్ స్టేడియంలో కూడా కొనసాగి, భారత్‌కు గ్రాండ్ విక్టరీలను అందించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

©️ VIL Media Pvt Ltd.