Reading Time: < 1 minute
Telangana Cancer Notifiable Disease Govt Decision

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న క్యాన్సర్ మహమ్మారిని కట్టడి చేసేందుకు, ఇకపై ఈ వ్యాధిని ‘నోటిఫైడ్ డిసీజ్’ (Notifiable Disease) గా గుర్తిస్తూ ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ జీవో నంబర్ 17ను విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం, రాష్ట్రంలోని ఏ మూలన క్యాన్సర్ కేసు నమోదైనా, ఆ వివరాలను ప్రభుత్వం నిర్దేశించిన పోర్టల్‌లో నమోదు చేయడం ఇప్పుడు చట్టబద్ధంగా అనివార్యం.

BCCI మాస్టర్ ప్లాన్.. నెక్స్ట్ జెనరేషన్ టెస్ట్ క్రికెటర్లను తీర్చిదిద్ధేందుకు ప్రత్యేక రోడ్ మ్యాప్..!

గతంలో కేవలం నిమ్స్ (NIMS) , మెహదీ నవాజ్ జంగ్ (MNJ) వంటి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రుల్లో మాత్రమే క్యాన్సర్ రిజిస్ట్రీలు నిర్వహించబడేవి. దీనివల్ల ప్రైవేట్ రంగంలో చికిత్స పొందుతున్న వేలాది మంది రోగుల వివరాలు ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉండేవి కావు. ఫలితంగా వ్యాధి తీవ్రత ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది, ఏ వయస్సు వారు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు అనే అంశాలపై ఖచ్చితమైన అంచనా ఉండేది కాదు. ఈ లోటును భర్తీ చేస్తూ, ఇకపై ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, , చివరకు ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా తమ వద్దకు వచ్చే క్యాన్సర్ కేసుల వివరాలను ఒక నెల రోజుల్లోపు ఆరోగ్య శాఖకు నివేదించాల్సి ఉంటుంది.

Trump: ఈ రాత్రికి ఇరాన్ నాగరికత అంతమైపోతుంది.. ట్రంప్ చివరి హెచ్చరిక

ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా క్యాన్సర్ కేసుల ఖచ్చితమైన డేటా ప్రభుత్వం వద్ద కేంద్రీకృతం అవుతుంది. హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే (MNJ) క్యాన్సర్ ఆసుపత్రి ఈ సమాచార సేకరణకు కేంద్ర బిందువుగా వ్యవహరిస్తుంది. సేకరించిన ఈ డేటా ఆధారంగా ప్రభుత్వం భవిష్యత్తులో ఎక్కడ స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి, ఏ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి , ఎక్కడ పాలియేటివ్ కేర్ సేవలను విస్తరించాలి అనే విషయాలపై శాస్త్రీయమైన ప్రణాళికలు రూపొందిస్తుంది. రోగుల వ్యక్తిగత వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతూనే, ప్రజారోగ్య ప్రయోజనాల కోసం ఈ గణాంకాలను విశ్లేషించి క్యాన్సర్ రహిత తెలంగాణ దిశగా అడుగులు వేయడం ఈ జీవో ప్రధాన ఉద్దేశ్యం.