Reading Time: 2 minutes
30కి పైగా సినిమాలు, 40కి పైగా టీవీ షోలు.. కట్ చేస్తే ఇప్పుడు ఆ జిల్లాకు కలెక్టర్

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్ ఇలా వచ్చి అలా మాయం అవుతుంటారు. తక్కువ సినిమాలతో ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న చాలా మంది భామలు ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ కూడా ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించింది. తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రేక్షకులను అలరించింది. ఇండస్ట్రీలకి అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అలాగే బుల్లితెరపై 48 షోలలో పాల్గొంది. ఇండస్ట్రీలో దాదాపు 32 సినిమాల్లో నటించిన ఈ హీరోయిన్ ఇప్పుడు క్యారెక్టర్ అయ్యింది. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే నటనకు గుడ్ బై చెప్పి UPSC ఎగ్జామ్ రాసి పాసై ఇప్పుడు IASగా విధులు నిర్వహిస్తుంది.

సౌందర్య ఆ స్టార్ హీరోతో సినిమా చేయాల్సింది.. కానీ అతను చెప్పిన ఒకే ఒక్క మాటతో..

ఆమె మరెవరో కాదు.. హెచ్.ఎస్. కీర్తన. పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి మంది గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని హోసకేరె గ్రామంలో జన్మించింది కీర్తన. కేవలం 4 ఏళ్ల వయసులోనే నటన ప్రపంచంలోకి అడుగుపెట్టింది. కర్పుర్దా గొంబే సినిమాతో నటిగా సినీ ప్రయాణం స్టార్ట్ చేసిన ఆమె దాదాపు 30కి పైగా సినిమాలు, 40కి పైగా టీవీ షోలలో కనిపించింది.

తల్లి దండ్రులకు కర్మకాండలు చేయలేకపోయా..! బంధువులందరూ తిట్టారు.. ఎమోష్నల్ అయిన హీరో

‘గంగ-యమున’, ‘హబ్బా’, ‘లేడీ కమిషనర్’, ‘పుట్టని ఏజెంట్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. సినిమా ఇండస్ట్రీలో కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఆమె యాక్టింగ్ కు గుడ్ బై చెప్పాలనుకుంది. 2011లో కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ పరీక్షలో ఉతీర్ణత సాధించింది. రెండేళ్లు అధికారిగా పనిచేసింది. ఆమె కోరిక యూపీఎస్సీ పాసై ఐఎఎస్ అధికారిణి కావడమే. వరుసగా ఐదు సార్లు UPSC ఎగ్జామ్ రాసి విఫలమైంది. చివరకు ఆరో ప్రయత్నంలో ఆమె IAS ఆఫీసర్ అయ్యింది. UPSCలో 167 ఆల్ ఇండియా ర్యాంక్ సాధించింది. కీర్తన మొదటి నియామకం కర్ణాటకలోని మాండ్య జిల్లాలో అసిస్టెంట్ కమిషనర్‌గా జరిగింది.

50 దేశాల్లో విడుదలైన బ్లాక్ బస్టర్ సినిమా.. తొలి తెలుగు పాన్ వరల్డ్ మూవీ.. ఇప్పటికీ ఆ రికార్డ్ అలానే

Keerthana

Keerthana

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.