
వరుస విజయాలతో దూసుకుపోతున్న సక్సెస్ఫుల్ కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మరోసారి బాక్సాఫీస్ వద్ద నవ్వుల జాతర సృష్టించడానికి సిద్ధమయ్యారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్పై స్టార్ ప్రొడ్యూసర్ సాహు గారపాటి నిర్మాణంలో అనిల్ రావిపూడి ఒక భారీ క్రేజీ ప్రాజెక్ట్ను పట్టాలెక్కిస్తున్నారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ లు హీరోలుగా నటించనున్న ఈ సినిమాకి సంబంధించిన అధికారిక పూజా కార్యక్రమాలను రేపు, అంటే జూన్ 18వ తేదీ గురువారం ఉదయం 9 గంటల నుంచి చాలా గ్రాండ్గా నిర్వహించబోతున్నారు. అనిల్ రావిపూడికి బాగా కలిసొచ్చిన రామానాయుడు స్టుడియోలో ఈ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది.
ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్టర్ తెగ వైరల్ అవుతోంది. అనిల్ రావిపూడి మార్క్ అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించబోతున్నారు. శ్రీమతి అర్చన సమర్పణలో, జీ స్టూడియోస్ భాగస్వామ్యంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. అరటి ఆకులు, పచ్చటి ప్రకృతి బ్యాక్డ్రాప్తో చాలా పాజిటివ్ వైబ్స్ ఇస్తూ డిజైన్ చేసిన ఈ అనౌన్స్మెంట్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని ఒక్కసారిగా పెంచేసింది. రేపు జరగబోయే ఈ గ్రాండ్ ఓపెనింగ్ వేడుకకు టాలీవుడ్కు చెందిన పలువురు ప్రముఖ స్టార్ హీరోలు, దర్శకులు ముఖ్య అతిథులుగా హాజరుకాబోతున్నట్లు సమాచారం.