Reading Time: < 1 minute
Sithara Naga Vamsi To Produce Another Film With Surya Director Almost Fix

పాత ఫ్లాప్ లెక్కలన్నీ కరుప్పుతో బదులిచ్చేశాడు సూర్య. నడిపిన్ నాయగన్ ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీ. ఇటీవల ఓటీటీలో వచ్చిన ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మంచి వ్యూస్ దక్కించుకుంటోంది. కరుప్పుతో 340 కోట్లు కొల్లగొట్టడంతో విశ్వనాథ్‌ అండ్ సన్స్‌పై అంచనాలు పెరిగాయి. టార్గెట్ మారింది. లక్కీ భాస్కర్ తర్వాత వెంకీ అట్లూరి నుండి వస్తున్నమూవీ కావడంతో ఇంట్రస్ట్ క్రియేట్ అవుతోంది. ఆగస్ట్ 14న రిలీజయ్యే ఈ మూవీని ఫస్ట్ సింగిల్‌తో ప్రమోషన్స్ షురూ చేయనుంది మూవీ టీం.
మలయాళ దర్శకుడు జీతూ మాధవన్‌తో వర్క్ చేస్తోన్న సూర్య 47 ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ కావొస్తుంది. దీంతో నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌పై ఇప్పటి నుండే ఫోకస్ చేస్తున్నాడు నడిపిన్ నాయగన్. జై బీమ్ ఫేం టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో 48 ఉండబోతుందని సమాచారం. ఈ మూవీస్ కన్నా తన 50త్ ప్రాజెక్ట్ పై సూర్య ఫోకస్ చేస్తున్నాడని చెన్నై టాక్. మైల్ స్టోన్ మూవీ కోసం తెలుగు డైరెక్టర్ అనిల్ రావిపూడిని సూర్య టీం సంప్రదించినట్లు కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరీ అతడేమన్నాడో కానీ.. కొత్తగా నెల్సన్ దిలీప్ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం జైలర్2తో కాలక్షేపం చేస్తున్న నెల్సన్ నెక్ట్స్ మల్టీస్టారర్ ఫిల్మ్స్ లోడ్ చేస్తున్నాడు. ఈ సినిమా ఫినిష్ అవగానే సూర్య సినిమా కోసం వర్క్ చేయబోతున్నాడట నెల్సన్. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను టాలీవుడ్ బడా నిర్మాత నాగవంశీ నిర్మించబోతున్నాడు. ప్రస్తుతం సూర్య హీరోగా విశ్వనాథ్ అండ్ సన్స్ చేస్తున్నాడు నాగవంశీ. నెల్సన్ సినిమా ఒకే అయితే సూర్యతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో జాక్ పాట్ కొట్టినట్టేనని ట్రేడ్ వర్గాల గుసగుస.