Reading Time: < 1 minute

మూసీ, ఓఆర్ఆర్ మధ్యలో బ్రిడ్జికి భూసేకరణ అవసరం లేదు

Caption of Image.

హైదరాబాద్​సిటీ, వెలుగు: మూసీ కారిడార్ ​ప్రాజెక్టులో మూసీపై మేజర్ బ్రిడ్జికి మార్గం సుగమమైంది. దీని నిర్మాణానికి  భూసేకరణకు ప్రభుత్వం మినహాయింపు ఇస్తూ సోమవారం జీవో విడుదల చేసింది. నార్సింగిలోని ఔటర్​ కు మూసీ పై నిర్మించే ఈ బ్రిడ్జిని లింక్​ చేయాలని హెచ్ఎండీఏ ప్లాన్ ​చేసింది. 

భూసేకరణకు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపగా.. గండిపేట మండలంలోని మంచిరేవుల గ్రామం సర్వే నంబర్​476, 508 లో భూసేకరణ అవసరం లేకుండానే బ్రిడ్జి నిర్మించేందుకు జీవో ఇచ్చింది. దీనివల్ల వెస్ట్​ సిటీలోని నార్సింగి, కోకాపేట, ఫైనాన్షియల్​ డిస్ట్రిక్ట్​ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్​ సమస్య పరిష్కారం అవుతుంది.

©️ VIL Media Pvt Ltd.