
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అంతర్జాతీయ స్థాయి అడ్వెంచర్ చిత్రం ‘వారణాసి’ షూటింగ్తో ఫుల్ బిజీగా ఉన్నారు. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పట్టాలపై ఉండగానే మహేశ్ బాబు తన తదుపరి సినిమాను ఎవరితో చేయబోతున్నారనే దానిపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి.
ఈ క్రమంలోనే ‘ఉప్పెన’, ‘పెద్ది’ చిత్రాల దర్శకుడు బుచ్చిబాబు సాన.. మహేశ్ బాబుకు ఒక కథను వినిపించారని, వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతోందంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. అయితే ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ కాంబినేషన్ సెట్ అవ్వడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. తాజా సమాచారం ప్రకారం మహేశ్ బాబు తన తదుపరి చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ‘ఏషియన్ సినిమాస్’ బ్యానర్లో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ఈ క్రేజీ ప్రాజెక్ట్ను హ్యాండిల్ చేయడానికి ఒక ప్రముఖ పాన్ ఇండియా దర్శకుడి పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు, బుచ్చిబాబు – మహేశ్ బాబు కలయికపై సూపర్ స్టార్ అభిమానులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. రాజమౌళి సినిమా తర్వాత మహేశ్ బాబు రేంజ్ అంతర్జాతీయ స్థాయికి వెళ్తుందని, నెక్స్ట్ లైన్-అప్ కూడా అదే స్థాయిలో ఉండాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. బుచ్చిబాబు మార్క్ రా అండ్ రస్టిక్ ఎమోషనల్ కథలు మహేశ్ బాబు ఇమేజ్కు సెట్ కాకపోవచ్చని, పైగా వారణాసి లాంటి విజువల్ వండర్ తర్వాత మళ్లీ అంతకంటే భారీ కాన్సెప్ట్ ఉన్న దర్శకుడితోనే మహేశ్ ముందుకు వెళ్లాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అందుకే ఈ కాంబో రూమర్లపై సోషల్ మీడియాలో అభిమానుల నుండి కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ‘వారణాసి’ పూర్తయిన తర్వాతే మహేశ్ బాబు తన 29వ చిత్రంపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.