Reading Time: < 1 minute

టీఎంసీ నేతలపై ఆగని దాడులు.. కోర్టుకు వెళ్తుండగా సౌమిత్ర బెనర్జీపై కోడి గుడ్లతో అటాక్

Caption of Image.

కోల్‎కతా: వెస్ట్ బెంగాల్‎లో ప్రతిపక్ష టీఎంసీ నేతలపై దాడులు ఆగడం లేదు. ఇటీవల ఎమ్మెల్యేలు మదన్ మిత్రా, కునాల్ ఘోష్, ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగానే, తాజాగా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకుడు సౌమిత్ర బెనర్జీపై దాడి జరిగింది. ఓ కేసు విచారణలో భాగంగా మంగళవారం (జూన్  16) కోర్టుకు వెళ్తుండగా సౌమిత్ర బెనర్జీపై స్థానికులు కోడి గుడ్లతో దాడి చేశారు. చోర్ చోర్ (దొంగ దొంగ) అంటూ నినాదాలు చేశారు.

 పశ్చిమ బర్ధమాన్ జిల్లాలోని రాణిగంజ్ నగరంలో ఈ ఘటన జరిగింది. పోలీసు సిబ్బంది వెంటనే జోక్యం చేసుకుని.. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఆందోళనకారులను సముదాయించి సౌమిత్ర బెనర్జీని సురక్షితంగా కోర్టుకు తరలించారు. టీఎంసీ నేతలపై వరుస దాడులు బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై ఇప్పటి వరకు టీఎంసీ స్పందించలేదు. 

►ALSO READ | బర్త్‌డే వేడుకల్లో ఘోరం.. మూడేళ్ల పిల్లాడి ప్రాణాల మీదకు తెచ్చిన కేక్.. ఏం మింగాడో తెలుసా ?

 

©️ VIL Media Pvt Ltd.