Reading Time: < 1 minute
Siddipet Rains Crop Damage Husnabad Farmers Loss

Rain Effect : అకస్మాత్తుగా కురుస్తున్న వర్షాలు రైతులను నిండా మంచుతున్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఈదురు గాలులతో కురిసిన మోస్తారు వర్షం కురిసింది. ఉదయం నుంచి తీవ్ర ఎండ ప్రభావం ఉండగా మధ్యాహ్న సమయంలో వాతావరణం చల్లబడి ఆకస్మాత్తుగా మోస్తారు వర్షం పడింది. వర్షం దాటికి హుస్నాబాద్ మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి రైతులు ఆరబోసిన మొక్కజొన్నలు, వరి ధాన్యం తడిసిపోయింది. మొక్కజొన్న, వరి ధాన్యానికి టార్పాలిన్ కవర్లు కప్పేలోపే వర్షం జోరుగా కురిసి ధాన్యం తడిచిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి మొక్కజొన్న, వరి ధాన్యం తీసుకువచ్చి 15 రోజులు దాటుతున్న తేమ పేరుతో కొనుగోలు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరారు.