
మాలీవుడ్ ఒక్కొక్క మెట్టు ఎదుగుతోంది. ఎవ్రీ ఇయర్ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. వంద కోట్లు కొల్లగొడితే గ్రేట్ అనుకునే స్టేజ్ నుండి 300 కోట్లకు పైగా కొల్లగొట్టే స్థాయికి ఎదిగింది. ఫ్రెండ్లీ బడ్జెట్తో సినిమాలు నిర్మించి సక్సెస్ పొందుతోంది. 2024లో మంజుమ్మల్ బాయ్స్ 200 కోట్లు క్రాస్ చేస్తే.. గత ఏడాది ఎంపురన్ దాన్ని బీట్ చేసింది. కానీ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ లోక ఈ రికార్డ్స్ మొత్తం చెరిపేసింది. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టుకుని మాలీవుడ్ హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది. అంతే కాదు సౌత్లో హయ్యెస్ట్ గ్రాసర్ ఫీమేల్ లీడ్ మూవీగా టాప్ ప్లేస్ని ఆక్యుపై చేసింది.
ప్రస్తుతానికి మాలీవుడ్లో ఈ నంబర్ ఇంకా పదిలంగానే ఉంది. ఈ ఏడాది మమ్ముట్టి, మోహన్ లాల్ భారీ మల్టీస్టారర్ ఫిల్మ్ పేట్రియాట్ 300 కోట్లను బీట్ చేసేస్తుందేమే అనుకున్నారు.. కట్ చేస్తే వంద కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది మూవీ. దృశ్యం3తో లాలట్టన్ టచ్ చేస్తారనుకుంటే సాధ్యపడలేదు. పాన్ ఇండియా ఐడెంటిటీ ఉన్న పృధ్వీరాజ్ సుకుమార్ ఐ నోబడీతో వచ్చాడు. కానీ కలెక్షన్స్ పేలవంగా మారాయి. ఈయన కన్నా చిన్న హీరోలు నయం అనిపించుకున్నారు. ఈ ఏడాది ఆరు నెలలే గడిచింది. లోక నంబర్స్ బీట్ చేయాలంటే ఇంకో 4 నెలలే మిగిలున్నాయి. స్టార్స్ కూడా తమ సినిమాలతో సిద్దమౌతున్నారు. పృధ్వీ రాజ్ అండ్ దుల్కర్ సల్మాన్ ఓనం పండుగకు వస్తున్నారు. ఇద్దరు ఒకే రోజు బరిలోకి దిగుతున్నారు. ఖలీఫాతో వరద రాజ్ మన్నార్.. ఐయామ్ గేమ్తో డీక్యూ ఆగస్ట్ 20లో బరిలోకి దిగుతున్నారు. అలాగే మమ్ముట్టి, మోహన్ లాల్ నెక్ట్స్ సినిమాలతో రెడీగా ఉన్నారు. మరీ ఫీమేల్ సెంట్రిక్ మూవీ కలెక్షన్స్ ఎవరు బీట్ చేస్తారో? ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్ ఎ వరు సృష్టిస్తారో లెట్స్ సీ.