Reading Time: < 1 minute
Iran Executes Two For Espionage Mossad Links

Iran: అమెరికాలో ఉద్రిక్తతల కొనసాగుతున్న వేళ, దేశంలో ఉరిశిక్షలకు తెర తీసింది ఇరాన్. గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరిని ఉరి తీసింది. దేశానికి సంబంధించి సున్నితమైన సమాచారాన్ని లీక్ చేశారని, దేశానికి వ్యతిరేకంగా ఇజ్రాయిల్‌కు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ కోర్టు శిక్ష విధించింది. రాయిటర్స్ ప్రకారం.. ఇద్దరు వ్యక్తుల్లో ఒకరిపై ఇస్ఫహాన్ ప్రావిన్సులోని నతాంజ్ అణు కేంద్రం చుట్టూ గూఢచర్యం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇజ్రాయిల్ గూఢచార సంస్థ మొస్సాద్‌కు సహకరించినందుకు వారిని దోషులుగా నిర్ధారించి ఉరితీసినట్లు ఇరాన్ న్యాయ వ్యవస్థ తెలిపింది.

Read Also: Getup Srinu: మేం కాపులం వివాదం.. అంతా ప్రమోషనా?

గత రెండు వారాల్లో ఇది రెండో ఉరిశిక్ష. ఏప్రిల్ 20న ఇరాన్ ఇలాంటి ఆరోపణలపై ఇద్దరు వ్యక్తుల్ని ఉరితీసింది. వీరిద్దరు మొస్సాద్ నెట్వర్క్‌లో భాగమని, దేశంలో దాడులకు ప్రణాళిక రచిస్తున్నట్లు ఆరోపించింది. ఇరాన్ ఉరిశిక్షల్ని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలతో పాటు ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండించింది. ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్ కనీసం 21 మందికి మరణశిక్ష అమలు చేసింది. జాతీయ భద్రతకు సంబంధించిన కేసుల్లో 4000 మందిని అరెస్ట్ చేసింది.