వాంగ్ చుక్ దీక్షకు మద్ధతుగా 50 మంది ఎంపీలతో ధర్నా చేస్తాం: ఎంపీ సుప్రియా సూలే

నీట్ ప్రశ్నా పత్రాల లీక్ కు వ్యతిరేకంగా హక్కుల ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరాహార దీక్ష 20వ రోజుకు చేరుకుంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న దీక్షకు శుక్రవారం (జులై 17) మద్ధతు తెలిపారు ఎన్సీపీ (శరద్ పవార్) ఎంపీ సుప్రియా సూలే. వాంగ్ చుక్ ఆరోగ్యం క్షణిస్తుండటంతో దీక్ష విరమించాలని ఈ సందర్భంగా కోరారు.
కాక్రోచ్ జనతా పార్టీతో కేంద్రం వెంటనే చర్యలు జరపాలని ఈ సందర్భంగా కోరారు. దేశంలో పరీక్షల విధానంలో మార్పులు తేవడంతో పాటు విద్యార్థుల ఆందోళనలకు కేంద్రం తక్షణ పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. 20న సీజేపీ చేపట్టనున్న చలో పార్లమెంటుకు మద్ధతు ఇస్తున్నట్లు తెలిపారు. 50 మంది ఎంపీలతో జంతర్ మంతర్ వచ్చి ఆందోళనలో పాల్గొంటామని అన్నారు.
20 తర్వాత దెయ్యమై వస్తా: సోనం వాంగ్చుక్
20 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వాంగ్ చుక్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఆయనకు టెస్టులు నిర్వహించిన వైద్యులు.. ఆహారం తీసుకోకపోవడంతో డీహైడ్రేషన్ అవుతున్నట్లు చెప్పారు. గత 24 గంటల్లో 350 గ్రాములు తగ్గారని చెప్పారు.
Also Read : దీక్ష విరమణపై సోనమ్ వాంగ్ చుక్ కీలక ప్రకటన
ఈ సందర్భంగా దీక్ష విరమించాలని కోరడంతో.. జులై 20వ తేదీన పార్లమెంట్ మార్చ్ లో పాల్గొంటానని.. అప్పటి వరకు దీక్ష విరమించబోనని స్పష్టం చేశారు. ఒకవేళ ఆందోళన సక్సెస్ కాకపోతే.. 20వ తేదీ తర్వాత దయ్యమై వస్తానని సరదాగా అన్నారు. నీట్ లీకేజీకి బాధ్యతగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.