July 18, 2026

ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..

ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
Reading Time: < 1 minute
Washington Sundar Ruled Out India England 3rd Odi Injury

భారత క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో జరగబోయే మూడో వన్డే మ్యాచ్‌కు దూరమయ్యాడు. కార్డిఫ్‌లో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆయన కుడి కాలు కండరాలు లాగడంతో ఇబ్బంది పడ్డారు. 33వ ఓవర్‌లో పరుగులు తీస్తున్న క్రమంలో ఈ గాయం కాగా, ఫిజియో చికిత్స అందించిన తర్వాత కూడా ఆయన ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. ఆ తర్వాతి బంతికే సాకిబ్ మహమూద్ బౌలింగ్‌లో అవుట్ అయ్యారు. గాయం తీవ్రత కారణంగా సుందర్ రెండో ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్ చేయడానికి గానీ, బౌలింగ్ చేయడానికి గానీ మైదానంలోకి రాలేదు.

ఆయన స్థానంలో ప్రిన్స్ యాదవ్ ఫీల్డింగ్ చేశారు. సుందర్ దూరం కావడంతో భారత్ కేవలం ఐదుగురు బౌలర్లపైనే ఆధారపడాల్సి వచ్చింది. దీనివల్ల జట్టు వ్యూహాలు మార్చుకోవాల్సి వచ్చిందని, బౌలింగ్ మార్పులలో ఇబ్బంది కలిగి మొమెంటం దెబ్బతిందని మ్యాచ్ అనంతరం శుభ్‌మన్ గిల్ అభిప్రాయపడ్డారు.

ఈ రెండో వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రస్తుతం 1-1 తో సమమైంది. అంతకుముందు జరిగిన మొదటి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు సిరీస్ విజేతను నిర్ణయించే లార్డ్స్ వేదికగా ఆదివారం జరిగే మూడో వన్డే మ్యాచ్‌కు సుందర్ అందుబాటులో ఉండటం లేదు. ఇప్పటికే ఈ సిరీస్ ప్రారంభానికి ముందే హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి కూడా గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. నితీష్ రెడ్డికి క్వాడ్రిసెప్స్ సమస్య, హర్షిత్ రాణాకు గ్రేడ్ 1 హ్యామ్‌స్ట్రింగ్ గాయం అయినట్లు స్కాన్లలో తేలింది. ఈ కీలక ఆటగాళ్ల గైర్హాజరీ భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది.