కోహ్లీ, గంభీర్ మధ్య గొడవలా..? అసలు విషయం బయటపెట్టిన బ్యాటింగ్ కోచ్..!

Virat Kohli Gautam Gambhir relationship: భారత క్రికెట్ జట్టు ప్రధాన శిక్షకుడు గౌతమ్ గంభీర్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీల మధ్య మాటల్లేవంటూ సాగుతున్న ప్రచారానికి తెరపడింది. ఇంగ్లాండ్తో జరిగిన రెండో వన్డే తర్వాత జట్టు బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ విలేకరుల సమావేశంలో మాట్లాడి, వీరిద్దరి బంధంపై వస్తున్న ఊహాగానాలను పూర్తిగా ఖండించారు.
ఊహాగానాలకు తెరదించిన సితాంశు కోటక్..
గతేడాది విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికినప్పటి నుంచి, ప్రధాన శిక్షకుడిగా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్తో ఆయనకు సెంటిమెంట్లు కలవడం లేదనే వార్తలు జోరందుకున్నాయి. ముఖ్యంగా ఎడ్జ్బాస్టన్లో ఇంగ్లాండ్తో జరిగిన మొదటి వన్డేకు ముందు, నెట్స్ ప్రాక్టీస్ సమయంలో వీరిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదనే విజువల్స్ సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారాయి. 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల నేపథ్యంలో జట్టులో వాతావరణం బాగోలేదంటూ వస్తున్న వార్తలపై బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ గురువారం రాత్రి గట్టిగా స్పందించారు.
ఇది కూడా చదవండి: తప్పు జరిగింది అక్కడే.. అతన్ని నమ్మి ఓడిపోయాం.. ఆ ఒక్కడు ఉండుంటే ఫలితం మరోలా..
“వారిద్దరి మధ్య వారధులు అవసరం లేదు”
రెండో వన్డే ముగిసిన అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో కోటక్ మాట్లాడుతూ, సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లన్నీ పూర్తిగా అవాస్తవాలని కొట్టిపారేశారు. “విరాట్, గౌతమ్ ఈరోజు కనీసం పది సార్లు మాట్లాడుకుని ఉంటారు. వారిద్దరూ ఒకరితో ఒకరు సంభాషించుకోవడానికి మధ్యలో ఎలాంటి వారధులు లేదా మధ్యవర్తులు అవసరం లేదు. ఈ పుకార్లన్నీ ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయో నాకైతే అస్సలు అర్థం కావడం లేదు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నెట్స్ ప్రాక్టీస్ సమయంలో కోహ్లీతో తాను మాట్లాడిన విషయంపై కూడా కోటక్ స్పష్టత ఇచ్చారు. విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజ ఆటగాడి బ్యాటింగ్ శైలిని అంత తేలికగా మార్చలేమని, ఆయన తన ఫుట్వర్క్, కొన్ని సాంకేతిక విషయాలపై అడిగిన సందేహాలను నివృత్తి చేయడానికి మాత్రమే తాను సంభాషించానని, ఆ సమయంలో గంభీర్ పక్కనే ఉండి బ్యాటింగ్ను నిశితంగా గమనించారని ఆయన వివరించారు.
కార్డిఫ్ మ్యాచ్లో భారత్ పరాజయం..
ఇదిలా ఉంటే, కార్డిఫ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 44 ఓవర్లలో కేవలం 233 పరుగులకే ఆలౌట్ అయింది. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ అర్ధ సెంచరీలతో రాణించినప్పటికీ మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. అయితే ఈ ఇన్నింగ్స్ సమయంలో క్రీజులో ఉన్న కోహ్లీ, పిచ్ నెమ్మదిగా ఉందని, షార్ట్ పిచ్ బంతులు అనుకున్నంత వేగంగా రావడం లేదనే కీలక సమాచారాన్ని డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న హెడ్ కోచ్ గంభీర్కు పంపించారని కోటక్ తెలిపారు. అనంతరం ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ అద్భుతమైన పోరాటంతో 99 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి తన జట్టుకు విజయాన్ని అందించారు. దీనితో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రస్తుతం 1-1 తో సమమైంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..