పాకాల నుంచి నీటిని విడుదల చేయాలని ఆందోళనCaption of Image.
నర్సంపేట, వెలుగు: వరంగల్ జిల్లా ఖానాపురం మండలం పాకాల చెరువు నుంచి నుంచి ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ లీడర్లు డిమాండ్ చేశారు. గురువారం పాకాల మెయిన్గేట్ వద్ద గురువారం ఆ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కాంగ్రెస్ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో స్వల్ప తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో బీఆర్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు.