ఒక్క 4 పరుగులు కొడితే చాలు.. చరిత్రకు అడుగు దూరంలో కింగ్ కోహ్లీ

Virat Kohli: ఎడ్జ్బాస్టన్లో జరిగిన తొలి వన్డేలో కేవలం 5 పరుగులకే ఔటై అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన రన్ మెషిన్ విరాట్ కోహ్లీ, ఇప్పుడు కార్డిఫ్ (Cardiff) వేదికగా జరగబోయే రెండో వన్డేలో ఒక మైండ్ బ్లోయింగ్ కమ్బ్యాక్ (Comeback) ఇవ్వాలని చూస్తున్నాడు. ఇంగ్లాండ్తో జరగబోయే ఈ మ్యాచ్ ద్వారా టీమిండియాకు 2–0తో సిరీస్ అందించడమే కాకుండా, క్రికెట్ చరిత్రలోనే కొన్ని తిరుగులేని రికార్డులను తన ఖాతాలో వేసుకునేందుకు కోహ్లీకి ఒక సాలిడ్ ఛాన్స్ దక్కింది.
* ద్రావిడ్ రికార్డుకు ఎండ్ కార్డ్.. జస్ట్ 4 రన్స్:
ఇంగ్లాండ్ గడ్డపై అన్ని ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టీ20) కలిపి అత్యధిక రన్స్ చేసిన భారత బ్యాటర్గా ఇప్పటి వరకు ది వాల్ రాహుల్ ద్రావిడ్ టాప్లో ఉన్నాడు. అయితే ఈ రికార్డును బ్రేక్ చేసి ఇంగ్లాండ్లో నంబర్ వన్ ఇండియన్ ప్లేయర్ గా మారేందుకు కోహ్లీకి కేవలం 4 పరుగులు మాత్రమే కావాలి.. ప్రస్తుతం కోహ్లీ 2,642 పరుగులతో ద్రావిడ్ (2,645) కంటే కేవలం 3 రన్స్ మాత్రమే వెనుకంజలో ఉన్నాడు.
విదేశీ వన్డేల్లో 8000 క్లబ్.. సచిన్, గంగూలీ సరసన కోహ్లీ:
సొంతగడ్డపై కాకుండా విదేశీ మైదానాల్లో వన్డే క్రికెట్లో కోహ్లీ ఇప్పటి వరకు 182 మ్యాచ్ల్లో 7,935 రన్స్ కొట్టాడు. ఈ మ్యాచ్లో కోహ్లీ గనుక మరో 65 పరుగులు చేస్తే, విదేశీ వన్డేల్లో 8,000 పరుగుల మైలురాయిని అందుకున్న మూడో ఇండియన్ ప్లేయర్గా చరిత్ర సృష్టిస్తాడు. గతంలో భారత్ తరపున కేవలం సచిన్ టెండూల్కర్ (11,450), సౌరవ్ గంగూలీ (8,111) మాత్రమే ఈ క్లబ్లో చోటు దక్కించుకున్నారు.
►ALSO READ | టాస్ ఇంగ్లాండ్దే.. టీమిండియాకు ఫస్ట్ బ్యాటింగ్!
సంగక్కర వరల్డ్ రికార్డుకు ముప్పు:
న్యూట్రల్ వేదికలు కాకుండా, ప్యూర్ గా ప్రత్యర్థి జట్టు సొంత మైదానంలో అత్యధిక వన్డే పరుగులు చేసిన రికార్డు ప్రస్తుతం శ్రీలంక లెజెండ్ కుమార్ సంగక్కర (5,518 పరుగులు) పేరుపై ఉంది. కోహ్లీ ప్రస్తుతం 125 వన్డేల్లో 5,473 పరుగులతో కొనసాగుతున్నాడు. ఈ మ్యాచ్లో కింగ్ కోహ్లీ మరో 46 పరుగులు సాధిస్తే, సంగక్కరను వెనక్కి నెట్టి ఈ విభాగంలో వరల్డ్ నంబర్ వన్గా చరిత్ర నెలకొల్పనున్నాడు.
ఇంగ్లాండ్పై అత్యధిక రన్స్ చేసిన టాప్-4 ఇండియన్స్:
* రాహుల్ ద్రావిడ్: 46 మ్యాచ్ల్లో 2,645 పరుగులు
* విరాట్ కోహ్లీ: 58 మ్యాచ్ల్లో 2,642 పరుగులు
* సచిన్ టెండూల్కర్: 43 మ్యాచ్ల్లో 2,626 పరుగులు
* రోహిత్ శర్మ: 47 మ్యాచ్ల్లో 2,298 పరుగులు