Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట

Rohit Sharma and Virat Kohli: ఇంగ్లండ్తో ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నిరాశపరిచారు. 259 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఇద్దరూ వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోవడంతో ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్గా వచ్చిన రోహిత్ శర్మ ఆరంభం నుంచే పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డాడు. 21 బంతుల్లో కేవలం 11 పరుగులు చేసిన రోహిత్ను సామ్ కరన్ ఔట్ చేశాడు. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో హ్యారీ బ్రూక్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
రోహిత్ ఔటైన వెంటనే క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో కేవలం 5 పరుగులకే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో భారత్ రెండు కీలక వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. అంతకుముందు ఇంగ్లండ్ 258 పరుగులకు ఆలౌటైంది. జో రూట్ 76, లియామ్ డాసన్ 68 పరుగులతో జట్టును ఆదుకోగా, అక్షర్ పటేల్ నాలుగు వికెట్లు తీసి ఇంగ్లండ్ను భారీ స్కోరు చేయకుండా నిలువరించాడు. ఇక, 30 ఓవర్లు పూర్తి అయ్యే సరిక భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 163 పరగులు చేసింది.. అయితే, మంచి ఇన్సింగ్స్ ఆడిన కెప్టెన్ గిల్ 80 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్ కాగా.. శ్రేయస్ అయ్యర్ 35 పరుగులు చేసి రనౌట్ అయ్యారు.. కేఎల్ రాహుల్ ఒక పరుగు మాత్రమే చేశాడు..