July 14, 2026

IND vs ENG 1st ODI: అక్షర్ పటేల్ మ్యాజిక్.. 258 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్!

IND vs ENG 1st ODI: అక్షర్ పటేల్ మ్యాజిక్.. 258 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్!
Reading Time: < 1 minute
Ind Vs Eng 1st Odi Axar Patel 4 Wickets England All Out 258

IND vs ENG 1st ODI: భారత్ – ఇంగ్లండ్ మధ్య బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ విజయానికి 259 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు జాకబ్ బెథెల్, బెన్ డకెట్ శుభారంభం అందించినప్పటికీ భారత బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టి మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. ఒక దశలో ఇంగ్లండ్ 107 పరుగులకే ఆరు కీలక వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. అయితే జో రూట్, ఆల్‌రౌండర్ లియామ్ డాసన్ కలిసి ఏడో వికెట్‌కు విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇంగ్లండ్‌ను గౌరవప్రదమైన స్కోరును అందించారు.

జో రూట్ 76 పరుగులతో అజేయంగా నిలవగా, లియామ్ డాసన్ 68 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ భాగస్వామ్యమే ఇంగ్లండ్ స్కోరును 250 పరుగులు దాటించడంలో కీలక పాత్ర పోషించింది. భారత్ తరఫున అక్షర్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు పడగొట్టాడు. గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో రెండు వికెట్లు సాధించగా, జస్ప్రీత్ బుమ్రా, శివమ్ దూబే తలో వికెట్ ఖాతాలో వేసుకున్నారు. బుమ్రా దాదాపు 968 రోజుల తర్వాత వన్డేల్లోకి పునరాగమనం చేసి తన తొలి వికెట్ కూడా తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చాలా రోజుల తర్వాత కలిసి వన్డే ఆడుతుండగా, శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా భారత జట్టును నడిపిస్తున్నాడు.