ఆషాఢం అమావాస్య రోజే దిశ మార్చుకుంటున్న గురుడు.. వీరికి ముప్పు తిప్పలే
ఆషాఢం అమావాస్య చాలా ప్రత్యేకమైనది. అయితే ఈ రోజే గురు గ్రహం అస్తమిస్తుంది. అంతే కాకుండా ఆగస్టు 12 వరకు అంటే, ఆషాఢం మాసం పూర్తి అయ్యే వరకు గురు గ్రహం అలాగే ఉంటుంది. దీని వలన కొన్ని రాశుల వారు అనే ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. అందులో ముఖ్యంగా వృషభ రాశి, మిథున రాశి, కన్యా రాశి వారికి ఇది సమస్యలు తీసుకొస్తుంది.
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి ఇది చాలా కీలక సమయం. వీరు ఈ సమయంలో ఎంత పద్ధతిగా ఉంటే అంత మంచిది. లేకపోతే ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్నివిధాలుగా వీరు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టే సమయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. చాలా వరకు మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి.
మీన రాశి : మీన రాశ వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కానీ పనులు పూర్తి చేసే విషయంలో నిర్లక్ష్యం వ్యక్తం చేస్తారు. అంతే కాకుండా అన్ని విషయాల్లో గందరగోళం నెలకుంటుంది. తొందరపడి పనులు చేయడం అస్సలే మంచిది కాదు, కెరీర్లో అడ్డంకులు ఎదురు అవుతాయి.
కన్యా రాశి : కన్యా రాశి వారికి ఖర్చులు అధికం అవుతాయి. ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుంచి సమస్యలు ఎదుర్కుంటారు. ఆదాయం తగ్గుతుంది. ఒత్తిడి కూడా అధికం అవుతుంది. అనారోగ్య సమస్యలు అధికం అవుతాయి. అందువలన ఆరోగ్యం విషయంలో కూడా చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు




