Reading Time: < 1 minute
Aditya Dhar Breaks Tradition With Limited Media Shows For Durandhar Revenge Release

సాధారణంగా భాషతో సంబంధం లేకుండా ఏ సినిమా రిలీజ్ అవుతున్నా, మీడియా కోసం ఒక స్పెషల్ షో కేటాయించడం సర్వసాధారణం. ఈ మధ్యకాలంలో మీడియాపై ప్రేమతో మాగంటి వంశీ వంటి వాళ్ళు, రిలీజ్ రోజు కాకుండా తర్వాతి రోజు ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటూ టాలీవుడ్ వరకు ఒక ప్రత్యేకమైన పద్ధతి తీసుకొచ్చారు. కానీ దాదాపుగా సినిమా రిలీజ్ కి ఒకరోజు ముందు గానీ, లేదా సినిమా రిలీజ్ రోజు ఉదయం కానీ మీడియా కోసం ఒక షో కేటాయించడం అనేది బాలీవుడ్ మొదలు మలయాళ సినీ పరిశ్రమ వరకు జరుగుతూనే ఉంటుంది.

Also Read:Pawan Kalyan: ఓనూరులో పర్యటించిన డిప్యూటీ సీఎం.. స్థానిక సమస్యలపై పవన్ కళ్యాణ్ ఆరా

కానీ ‘దురంధర్’తో సూపర్ హిట్ అందుకుని, ఇప్పుడు ‘దురంధర్ రివెంజ్’ అంటూ సెకండ్ పార్ట్ తో వస్తున్న ఆదిత్య ధర్ మాత్రం ఈ సిస్టంకి బ్రేకులు వేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి దేశవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అవుతోంది. హిందీ సహా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే సుమారు ఐదు భాషలలో మీడియా కి షో చాలా లిమిటెడ్ గా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్క భాషకు కేవలం 30 టికెట్లు మాత్రమే కేటాయించడానికి నిర్మాణ సంస్థ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.

Also Read:Akshaye khanna: ‘‘అక్షయ్ ఖన్నా బట్టతల వల్ల కుంగిపోయారు’’, సంచలన విషయాలు బయటపెట్టిన ఫరా ఖాన్..

అంతేకాక, హైదరాబాద్ లో ఇటీవల నిర్మితమై ప్రారంభమైన మల్టీప్లెక్స్ స్పెషల్ షో కోసం రిక్వెస్ట్ చేసినా, ఆదిత్య ధర్ అందుకు ససేమిరా ఒప్పుకోనని చెప్పినట్లు తెలుస్తోంది. ఒక్కో లాంగ్వేజ్ మీడియా కి 30 టికెట్లు అంటే, చాలా లిమిటెడ్ మీడియాకి సినిమా చూపించేందుకు ఆదిత్య ధర్ సిద్ధమైనట్లుగా చెప్పవచ్చు. అయితే ఈ సినిమాకి ఉన్న క్రేజ్ దృష్ట్యా, ఆ టికెట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా కొనుగోలు చేసి చూసేందుకు ప్రస్తుతం ఎవరూ వెనకాడరు. అయితే ఇలా చేయడం వల్ల ఏమాత్రం సినిమా మీద నెగెటివిటీ వచ్చినా, కచ్చితంగా ట్రోల్స్ కి గురవ్వక తప్పదు. ఈ విషయంలో మరి ఆదిత్య ధర్ ధైర్యం సినిమా కంటెంట్ ఏనా లేక మరేదైనా నా అనేది రిలీజ్ అయితే గాని చెప్పలేం.