July 7, 2026

Tridha Choudhury : నరకం చూశాను.. గదిలో బందీనై రోజూ ఏడ్చేదాన్ని: స్టార్ నటి షాకింగ్ నిజాలు!

Tridha Choudhury : నరకం చూశాను.. గదిలో బందీనై రోజూ ఏడ్చేదాన్ని: స్టార్ నటి షాకింగ్ నిజాలు!
Reading Time: < 1 minute
Tridha Choudhury Interview Aashram Web Series Bold Scenes Anxiety Issues

బెంగాలీ భామ త్రిధా చౌదరి తెలుగులో ‘సూర్య వర్సెస్ సూర్య’తో పాటు ‘మనసుకు నచ్చింది’, ‘అనుకున్నది ఒక్కటి అయింది ఒకటి’ లాంటి సినిమాల్లో కనిపించింది. కానీ, ఓటీటీ కోసం చేసిన ‘ఆశ్రమ్’ వెబ్ సిరీస్ ఆమెకు మంచి క్రేజ్ తీసుకొచ్చింది. బాబీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్‌కి తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది.
అయితే, ఈ సిరీస్ షూటింగ్ టైమ్‌లో తాను ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ గురించి ఆమె తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టింది.

బాబీ డియోల్‌తో బోల్డ్ సీన్స్‌లో యాక్ట్ చేస్తున్న సమయంలో తన పర్సనల్ లైఫ్ పూర్తిగా నాశనమైందని, యాంగ్జైటీ కారణంగా ఒక్కోసారి ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారేదని చెప్పుకొచ్చింది. “నేను ఎవరితోనైనా మాట్లాడినా, ఏదైనా చేసినా ఎవరో ఒకరు వచ్చి నన్ను చుట్టుముట్టేస్తున్నట్లు, నాకేదో జరిగిపోతున్నట్లు భయపడేదాన్ని.” ఆ భయం కారణంగా షూటింగ్ సమయంలో చాలాసార్లు ఆసుపత్రి పాలయ్యానని ఆమె గుర్తు చేసుకుంది.

కరోనా సమయంలో ఒక గదికే పరిమితమైపోయానని, మానసికంగా ఒక చీకటి గదిలో బందీ అయినట్లు ఫీలింగ్ వచ్చేదని చెప్పుకొచ్చింది. తన టాక్సిక్ రిలేషన్ కారణంగా ఎవరినీ కలవలేక, ఎవరితోనూ మాట్లాడలేని దారుణమైన స్థితికి వచ్చానని, ఆఖరికి తన తండ్రితో కూడా మాట్లాడడం కుదరలేదని చెప్పుకొచ్చింది. చివరకు, తన స్నేహితుడి ఓదార్పు, అతను ఇచ్చిన ధైర్యం కారణంగానే ఈ పరిస్థితులను దాటి బయటకు వచ్చినట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతానికి ఆమె హిందీలో వరుస సినిమాలు చేస్తోంది.