Trump-Meloni: ‘‘వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు’’.. ట్రంప్ పోస్టుకు ఇటలీ కౌంటర్..

Trump-Meloni: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా ట్రంప్ మెలోనీని ఉద్దేశించి చేసిన పోస్టుకు ఇటలీ కౌంటర్ ఇచ్చింది. వ్యక్తులు వస్తారు, వెళ్తారు.. కానీ రెండు దేశాల మధ్య సంబంధాలు శాశ్వతంగా ఉంటాయని ఇటలీ రక్షణ మంత్రి గ్వీడో క్రొసెట్టో అన్నారు. నాటో సదస్సుకు ముందు ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికలో.. మెలోనీ తనవైపు అభిమానంతో చూస్తున్నట్లు మార్ఫింగ్ చేసిన ఫోటోను పోస్ట్ చేశారు. తనను వెంబడించొద్దు అనే అర్థం వచ్చేలా మెలోనీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఈ వ్యవహారంపై స్పందించిన ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీ స్పందించారు. ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలతో అమెరికా-ఇటలీ మధ్య సంబంధాలు దెబ్బతినవని అన్నారు. ఇరు దేశాలు మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలంగా కొనసాగుతుందని ఆయన అన్నారు. అయితే, ట్రంప్ పోస్టుపై మెలోనీ నేరుగా స్పందించలేదు.
గత నెలలో జరిగిన జీ7 సదస్సు తర్వాత నుంచి వీరిద్దరి మధ్య వివాదం మొదలైంది. తన పాపులారిటీని కాపాడుకునేందుకు, మెలోనీ నాతో ఫోటో దిగేందుకు ఆరాటపడిందని ట్రంప్ వ్యాఖ్యానించడంతో వివాదం మొదలైంది. ఫోటో కోసం మెలోనీ తనను వేడుకుందని ట్రంప్ అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై మెలోనీ స్పందిస్తూ.. ఈ వ్యాఖ్యలు అర్ధరహితం అని, మీతో స్నేహం చేయడం వల్ల నాకు ఎలాంటి రాజకీయ ప్రయోజనం కలుగదని, ముందు మీరు మీ పాపులారిటీపై దృష్టి పెట్టండి అంటూ ఘాటుగా స్పందించింది.