Reading Time: < 1 minute
Former Ibrahimpatnam Mla Kondigari Ramulu Passes Away

Kondigari Ramulu: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో రెండు పర్యాయములు సీపీఎం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందని ఎమ్మెల్యే కొండిగారి రాములు(91) కన్ను మూశారు. 1989,1994లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పేరుందిన నిజాయితీగల ఎమ్మెల్యేగా రాములు ఒక వెలుగు వెలిగారు. ఈరోజు ఉదయం నిద్రలో నుంచి లేచిన ఆయన మొఖం కడుక్కున్న పిదప నలతగా ఉందని మళ్లీ పడుకుని గుండెపోటుతో నిద్రలోనే కన్నుమూశారు. గత జూలై నెలలో భార్య ముత్యాలమ్మ మరణించారు. ఆయన స్వగ్రామం మంచాల మండలం ఆరుట్ల 1935వ సంవత్సరంలో జన్మించారు. చిన్ననాటి నుంచి కమ్యూనిస్టు భావాజాలం కలిగి ఉన్న ఈయన తొలిసారిగా 1989లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈయనకు ముగ్గురు సంతానం. ముగ్గురూ కుమారులే. పెద్ద కుమారుడు అనారోగ్య కారణాల వల్ల మృతి చెందారు. ఇక ఇద్దరు కుమారులు ఉండగా, మూడో కుమారుడు కొండి గారి త్రిలోక్ కుమార్, ఈ మధ్యకాలంలో మున్సిపల్ ఎన్నికల్లో 12 వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఎలాంటి ఆస్తిపాస్తులు లేకుండా సాధారణ జీవితం గడుపుతున్న వాళ్ళల్లో కొండి గారి రాములు ఒకరు. రాములు మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

READ MORE: RC17 Update: మార్చి 27.. సోషల్ మీడియా షేక్ అవ్వడం ఖాయం!