Reading Time: < 1 minute
N Chandrababu Naidu Serious At Collectors Conference Over Public Safety Incidents In Andhra Pradesh

CM Chandrababu Serious: కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో అధికారులపై సీరియస్ అయ్యారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ప్రజల ప్రాణాల పట్ల ఉదాసీనత ఉంటే సహించమంటూ అధికారులకి సీఎం చంద్రబాబు ఘాటైన వ్యాఖ్యలు చేశారు.. శ్రీకాకుళం డయేరియా, రాజమహేంద్రవరం కల్తీ పాలు, వేట్లపాలెం బాణసంచా లాంటి ఘటనలు బాధాకరం కలిగించాయంటూ సీఎం అసంతృప్తి చెందారు.. ప్రజల ప్రాణాలు లెక్క చేయకుండా ఎవరు వ్యవహరించినా కఠినంగా ఉంటామని అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.. స్వార్థపరుల చేతుల్లోకి పరిస్థితులు వెళ్లడానికి వీల్లేదని అధికారులతో సీఎం అన్నారు.. నీరు కలుషితం, పాలు కల్తీ అవుతుంటే ఆయా విభాగాలు ఏం చేస్తున్నాయని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.. బాణా సంచా నిబంధనలకు విరుద్ధంగా తయారు చేస్తుంటే ఏం చేస్తున్నారని అధికారులని సీఎం ప్రశ్నించారు.. కలెక్టర్లు కనీసం 8 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందని అలాగే సీనియర్ సెక్రటరీలు 4 రోజుల పాటు క్షేత్రస్థాయికి వెళ్లాలని సూచించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

Read Also: Sanju Samson: టీ20 వరల్డ్‌కప్‌లో కెప్టెన్‌ ముందు సంజు శాంసన్ ఒకే ఒక డిమాండ్‌..! ఆ సీక్రెట్‌ను లీక్‌ చేసిన సూర్య..