Reading Time: < 1 minute
టాలీవుడ్ లో నెంబర్ వన్ కుర్చీ దక్కించుకున్న ముద్దుగుమ్మ ఎవరో తెలుసా !

టాలీవుడ్‌లో నంబర్ వన్ హీరోయిన్ కుర్చీ చాలా కాలంగా ఖాళీగా ఉంది. ఈ స్థానాన్ని భర్తీ చేసేవారు కరువయ్యారు. ఒకప్పుడు అనుష్క, సమంత, తమన్నా వంటి స్టార్ హీరోయిన్లు కనీసం రెండేళ్లు, మూడేళ్లు టాప్‌లో ఉన్నారు. వారి తర్వాత పూజా హెగ్డే, రష్మిక మందన తమ క్రేజ్‌తో రెండేళ్లు దూసుకెళ్లారు. ఇటీవల శ్రీలీల ఏడాదిపాటు ఇండస్ట్రీని ఊపినా, ఆ మ్యాజిక్ కొనసాగలేదు. ప్రస్తుతం నంబర్ వన్ రేసు డల్‌గా సాగుతోంది. సాయి పల్లవి బాలీవుడ్‌కు తన దృష్టిని మార్చగా, రుక్మిణి వసంత్, భాగ్యశ్రీ బోర్సే, జాన్వీ కపూర్ వంటివారు ఒక్కట్రెండు సినిమాలతో సందడి చేస్తున్నారు. వీరంతా సీజనల్‌గా వచ్చి వెళ్తున్నారే తప్ప, పాతుకుపోయే వారు కనిపించడం లేదు. సమంత, తమన్నా, రష్మిక వంటి సీనియర్ తారలు ఇప్పుడు సీనియర్‌లుగా కొనసాగుతున్నారు. మరి టాలీవుడ్‌ను మళ్లీ శాసించే ఆ స్టార్ హీరోయిన్ ఎవరు కాబోతారో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ustaad Bhagat Singh: ఉస్తాద్ ఊహించని సర్‌ప్రైజ్.. ఫ్యాన్స్‌కు పండగే..

మారుతున్న ఆడియన్స్ మైండ్ సెట్.. ఆ సినిమాలకు పెను సవాల్

Dhurandhar 2: ధురంధర్ 2 ఆ రోజున వస్తుందా.. రాదా ??

Toxic: అరె.. టాక్సిక్ సినిమా వాయిదా పడటానికి కారణం అదా..

మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం.. అప్పుల బాధ తట్టుకోలేక