నేటి కాలంలో చిన్న వయసులోనే కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ మధ్య జిగురు తగ్గడం వంటి సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఈ సమస్యకు ప్రధాన కారణం జీవనశైలి మార్పులేనని నిపుణులు తెలిపారు. ఇంకా ఈ బెండకాయలు తినడం వలన కీళ్ళలో జిగురు పెరుగుతుందనేది అపోహని నిపుణులు కొట్టిపారేశారు. శరీరంలో జిగురు ఉత్పత్తి అవడానికి బయటి నుంచి ఏ పదార్థాలు అవసరం లేదని, శరీరం సహజంగానే దానిని ఉత్పత్తి చేస్తుందని చెబుతున్నారు.
కీళ్ళ మధ్య జిగురు తగ్గడానికి ప్రధాన కారణం అధిక ఉప్పు వినియోగం ఉప్పు కేవలం నాలుక రుచి కోసమే తప్ప, శరీరానికి బయటి నుంచి అవసరం లేదని అంటున్నారు. మనం అధికంగా తీసుకునే ఉప్పు శరీరంలో పేరుకుపోయి, ఇది కీళ్ళ సందుల్లోని జిగురును ఉత్పత్తి చేసే కణజాలాన్ని, కార్టిలేజ్ను నాశనం చేస్తుందని అంటున్నారు. జిగురును తిరిగి పొందాలంటే ఉప్పును తక్కువగా తీసుకోవాలని ఆయన చెబుతున్నారు.
ఉప్పుతో పాటు, కీళ్ళ కదలికలు లేకపోవడం కూడా జిగురు తగ్గడానికి కారణమని, అందువల్ల వ్యాయామాలు చేయడం ద్వారా కీళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని అంటున్నారు. బెండకాయలోని జిగురు కడుపులో యాసిడ్ల వల్ల నశించిపోతుందని, అది నేరుగా కీళ్ళకు అసలు చేరదని అంటున్నారు.
కీళ్ళ మధ్య జిగురు ఉత్పత్తిని పాడుచేసే ప్రధాన కారకం ఉప్పేనని అంటున్నారు. మనం తీసుకునే ఉప్పు కేవలం రుచి కోసమేనని, శరీరానికి బయటి నుంచి ఉప్పు అవసరం లేదని, కూరగాయలు, పండ్లు, గింజలలో సహజంగా ఉండే సాల్ట్ సరిపోతుందని అంటున్నారు.
రోజుకు 10-15 గ్రాముల ఉప్పు తింటున్నామని, ఇది శరీరానికి ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.
శరీరం ఈ అధిక ఉప్పును ఖాళీ ప్రదేశాలలో, ముఖ్యంగా కీళ్ళ సందులలో నిల్వ చేస్తుందని తెలిపారు. ఉప్పుకు ఉన్న గుణం ఏమిటంటే అది కణజాలాన్ని నాశనం చేస్తుంది. స్టీల్ డబ్బాలు, ఇనుప వస్తువులు, సిమెంట్ స్లాబ్లు కూడా ఉప్పు ప్రభావానికి గురై ఎలా దెబ్బతింటాయో అలాగే అని అంటున్నారు. ఇంకా కీళ్ళ సందుల్లో పేరుకుపోయిన ఉప్పు జిగురును ఉత్పత్తి చేసే కార్టిలేజ్ను, సైనోవియల్ మెంబ్రేన్ను దెబ్బతీసి, జిగురు ఉత్పత్తిని ఆటంకపరుస్తుందని చెప్పారు. అందుకే చిన్న వయసులోనే జిగురు తగ్గి, కీళ్ళ నొప్పులు వస్తున్నాయని అంటున్నారు.




