
ఎట్టకేలకు కాంగ్రెస్ పోరాటం ఫలించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ర్యాలీ తర్వాత ఉత్తరాఖండ్లోని హల్ద్వానీలో శుద్ధి చేశారన్న ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ వ్యవహారంపై రాజ్యసభలో కూడా ఖర్గే ప్రస్తావించారు. ఇక లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా తీవ్రంగా తప్పుపట్టారు. వెంటనే ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని డిమాండ్ చేశారు. మొత్తానికి ఇన్ని రోజుల తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ర్యాలీ అనంతరం హల్ద్వానీలోని రామ్లీలా మైదాన్లో జరిగినట్లు ఆరోపించబడిన ఒక శుద్ధీకరణ కార్యక్రమానికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైంది. న్యాయవాది అంజు దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా హల్ద్వానీ పోలీస్ స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తులపై ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తిపై కుల వివక్ష, సామాజిక అవమానం, ద్వేషాన్ని, న్యూనతా భావాన్ని రెచ్చగొట్టడం వంటి ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీలోని సెక్షన్లు 196, 299, 3(1)ఆర్, ఎస్సీ/ఎస్టీ చట్టం కింద ఈ కేసు నమోదు చేశారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, డాక్టర్ జగదీష్ చంద్ర, ఈ మొత్తం వ్యవహారాన్ని దర్యాప్తు చేయనున్నారు.
ఇదిలా ఉండగా ‘శుద్ధీకరణ’ కేసు విషయంలో కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేస్తోందని ఆరోపిస్తూ బీజేపీ షెడ్యూల్డ్ కులాల ఫ్రంట్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రాష్ట్రవ్యాప్త నిరసన చేపట్టింది. అయితే ఈ విషయమై పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేశారు.