కొనుగోలు దారులకు బంగారం, వెండి ధరలు మరోసారి షాక్ ఇచ్చాయి. గత రెండ్రోజులు తగ్గి సుమారు రూ.1,50లక్షలకు దగ్గరకు వచ్చిన బంగారం, వెండి ధరలకు మంగళవారం ఒక్కసారిగా రెక్కలోచ్చాయి. కేవలం ఇవాళ ఒక్కరోజే తులం బంగారం రూ.1200, వెండిపై రూ.100 పెరిగింది. దీంతో ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 24 క్యారట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,55,350 వద్ద ట్రేడవుతుండగా.. కేజీ వెండి ధర రూ.2,50,000 వద్ద ట్రేడవుతుంది.
ఈ భారీ హెచ్చుతగ్గుల తర్వాత హైదరాబాద్లో 24 క్యారట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,55,350 గా ఉండగా ఉందయం ఈ ధర రూ.1,54, 140గా ఉంది, అదే 22 క్యారట్ల బంగారం ధర రూ.1,42,400 వద్ద ట్రేడువుతుండగా ఉదయం 6 గంటలకు ఈ ధర రూ.1,41,290గా ఉంది. అంటే కేవలం నాలుగు గంటల్లోనే బంగారం ధర వేలల్లో పెరిగింది.
ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబై, బెంగళూరు, పూణె నగరాల్లో ప్రస్తుతం 24 క్యారట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,55,350 గా ఉండగా, 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,42,400గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం ధర రూ.1,55, 500 గా ఉండగా.. చెన్నలో 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,670 వద్ద ట్రేడువుంతి.
ఇక వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. కానీ ఈ సారి బంగారంతో పోల్చుకుంటే వెండి పెరుగుదల స్వల్పంగానే ఉంది. మంగళవారం కేజీ వెండిపై రూ.100 మాత్రమే పెరిగింది. ఈ పెరుగుదల తర్వాత దేశీయ మార్కట్లో కేజీ వెండి ధర రూ.2,50,000గా ఉండగా.. హైదరాబాద్లో రూ.2,55,500గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరులో సైతం ప్రస్తుతం ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
అయితే మీరు ఇక్కడో విషయం గుర్తుంచుకోవాలి.. బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పడూ మారుతూ ఉంటాయి. కాబట్టి మీరు బంగారం కొనాలని చూస్తుంటే మీ దగ్గర్లోని షోరూమ్కు వెళ్లి ప్రస్తుత ధరలను కనుక్కోండి. కొనే ముందు బంగరాం స్వచ్చమైందా లేదా అనేది హాల్మార్క్ ను బట్టి చూసుకోండి.




